sonykongara Posted July 21, 2017 Share Posted July 21, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 21, 2017 Author Share Posted July 21, 2017 edi mana ki use ayye laga unnayi Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted July 21, 2017 Share Posted July 21, 2017 4. Godavari (polavaram) - Krishna(Vijayawada) ippudu veellu gurthinchatam enti. manollu already complete chesaru ga 3. Icchampally - Nagarjuna Sagar aa icchampally nunche dora water ni river flow ki against ga up river teesukuveltundi. ala kakunda or in addition, ee project cheste, Warangal, Khammam and Nalgonda districts ki huge help (not to mention AP benefits). dora ala chaste cheyyadu. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 24, 2017 Author Share Posted July 24, 2017 గోదావరి పెన్నా సంధానానికి సర్వే కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు సర్వే నిర్వహణకు వ్యాప్కోస్ కసరత్తు అనంతరం పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక ఈనాడు - అమరావతి గోదావరి పెన్నా అనుసంధానంలో భాగంగా లైడార్ సర్వేకు కేంద్ర రక్షణశాఖ నుంచి అనుమతులు లభించాయి. ఈ సర్వే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి వరద జలాలను 320 టీఎంసీలకు పైగా పెన్నాకు మళ్లించేందుకు, మధ్యలో బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించేందుకు దాదాపు 700 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకానికి ప్రాథమికంగా ప్రణాళిక సిద్ధమైంది. ఎక్కడి నుంచి నీటిని ఎక్కడికి ఎలా మళ్లించాలనే విషయంలో వ్యాప్కోస్తో పాటు, జలవనరులశాఖ హైడ్రాలజీ విభాగం, జలవనరులశాఖ నిపుణులు కలిసి కూర్చుని ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర జలవనరులశాఖ ఈ బాధ్యతలను వ్యాప్కోస్కు అప్పచెప్పింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు ఎలైన్మెంట్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. డ్రోన్ల సాయంతో, సాంకేతికంగాను పూర్తి స్థాయిలో పరిశోధించి ప్రాథమిక ప్రణాళికకు తగ్గట్టుగా అక్కడ భూభౌతిక పరిస్థితులు ఉన్నాయా? లేవా? అన్నది నిర్ధారించుకుని ఆ సమాచారం ఆధారంగా పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తారు. ఈ లైడార్ సర్వేకు రక్షణశాఖ అనుమతులు ఇవ్వడంతో దాదాపు మూడు వారాల నుంచి వ్యాప్కోస్ బృందం ఇదే పనిలో నిమగ్నమయింది. ఎక్కడ ఏ ఎత్తు నుంచి సర్వే చేయాలి? వాతావరణ పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి? ఎన్ని రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయగలమనే విషయాలపై క్షేత్రస్థాయి కసరత్తు సాగిస్తోంది. రెండు నెలల్లో అనుకున్నా ఆలస్యం అయ్యింది మార్చి నెలలో గోదావరి పెన్నా అనుసంధానంపై ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వ్యాప్కోస్ రూపొందించిన నాలుగు ప్రతిపాదనలు, జలవనరులశాఖ హైడ్రాలజీ విభాగం రూపొందించిన మరో ప్రతిపాదనను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిలోని అంశాలను మేళవించి ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ఆయన సూచించగా లైడార్ సర్వేకు అనుమతులు కోరారు. అప్పట్లో రెండు నెలల్లోనే ఇది పూర్తి చేయాలనుకున్నా కొంత ఆలస్యమయింది. లైడార్ సర్వేతో పోల్చి చూసి.. ఇప్పుడు సాంకేతికంగా లైడార్ సర్వేతో పై ప్రణాళికలోని లెక్కలు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయి? ఏయే అంశాల్లో మార్పులు చేయాలి? ప్రాథమిక ఆలోచన ప్రకారం ప్రాజెక్టు చేపట్టడం సాధ్యమా? కాదా? అన్నది తేలుస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఇది ఎలా చేపట్టాలో నిర్ణయించనున్నారు. సీఎం ఈమధ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ గోదావరి-పెన్నా అనుసంధానం మూడు దశల్లో చేపట్టవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు రూ.80వేలకోట్లకు పైగా వ్యయమయ్యేలా ఉందని చెప్పారు. ఇది మరో పోలవరం ప్రాజెక్టు వంటిదని వ్యాఖ్యానించారు. స్థూలంగా ఇదీ ప్రణాళిక * గోదావరి వరద కాలంలో నీటిని ఎత్తిపోస్తూ కృష్ణా నదిని దాటించి అక్కడి నుంచి ఆరుదశల్లో నీటిని ఎత్తిపోస్తూ బొల్లాపల్లి అటవీ ప్రాంతానికి నీటిని తీసుకువెళ్లాలి. అక్కడ పెద్ద జలాశయం నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల జలాశయానికి నీటిని తీసుకువెళ్లవచ్చనేది ప్రాథమిక ప్రణాళిక. * గోదావరి వద్ద 45.00(సముద్ర మట్టానికి ఎగువ) మీటర్ల నుంచి 72(సముద్ర మట్టానికి ఎగువ) మీటర్లకు తొలుత నీటిని ఎత్తిపోస్తారు. * అక్కడి నుంచి 0.8 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని తీసుకువెళ్లి కాలువలో పోస్తారు. దాదాపు 220.305 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి కృష్ణా నది వరకు ఆ నీటిని గ్రావిటీ ద్వారా తీసుకువస్తారు. * కృష్ణా నదిలో ఆ నీటిని కలపకుండా నదిపై 3.67 కిలోమీటర్ల మేర అక్విడక్టును నిర్మించి 34.50(సముద్ర మట్టానికి ఎగువ) మీటర్లకు నీటిని తీసుకొస్తారు. అక్కడి నుంచి ఆరుదశల్లో నీటిని ఎత్తిపోస్తూ కాలువ ద్వారా బొల్లాపల్లి జలాశయానికి నీటిని తీసుకువెళ్తారు. అక్కడ 220(సముద్ర మట్టానికి ఎగువన) మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. * అక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా 375 కిలోమీటర్ల మేర ప్రయాణించి సోమశిలకు నీటిని చేరుస్తారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 24, 2017 Author Share Posted July 24, 2017 edi cheyynadi ra babu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 24, 2017 Author Share Posted July 24, 2017 4. Godavari (polavaram) - Krishna(Vijayawada) ippudu veellu gurthinchatam enti. manollu already complete chesaru ga edi mari comedy Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.