Jump to content

5 రాష్ట్రాల్లో బీచ్‌లకు మహర్దశ కోస్తాంధ్రకూ అవకాశం


Recommended Posts

5 రాష్ట్రాల్లో బీచ్‌లకు మహర్దశ

కోస్తాంధ్రకూ అవకాశం

తీర నియంత్రణ మండలి నిబంధనల్లో మార్పు

ఈనాడు - దిల్లీ

24ap-main6a.jpg

భారతదేశ తీర ప్రాంతాన్ని ప్రపంచ శ్రేణి బీచ్‌ల ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తీరంలో సుస్థిరాభివృద్ధికి వీలుగా కోస్తా నియంత్రణ మండలి నిబంధనల్ని సవరించనుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని నీతి ఆయోగ్‌, కేంద్ర పర్యాటక శాఖ ప్రతిపాదించాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, గుజరాత్‌లలో అయిదు చోట్ల పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దనున్నారు. కేరళ, గోవాలలో పర్యాటకులకు ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో అలాంటివి ఈ 5 రాష్ట్రాల్లోనూ కల్పించనున్నారు. మురుగునీరు పారడానికి, ఘన వ్యర్థాల యాజమాన్యానికి ప్రతీ జోన్‌కు ఒక విస్తార ప్రణాళిక ఉంటుంది.

ఏమేం చేస్తారంటే...

గుర్తించిన పర్యాటక ప్రదేశాల్లో ఆహారశాలలు, థీమ్‌ పార్కులు, గోల్ఫ్‌ కోర్సులు, రిసార్టులు, హోటళ్లు, హాయిగా తీరంలో కూర్చొని సాగరతీర అందాలను ఆస్వాదించేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఉంటాయి. వీటన్నింటి నిమిత్తం కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇస్తుందనీ, వీటిని వాడుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సీఆర్‌జెడ్‌ నిబంధనల్ని గణనీయంగా సడలించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తీరం నుంచి 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. అయిదు జోన్లలో ఎలాంటి అభివృద్ధి పనుల్ని చేపట్టబోతుందీ తెలిపే మార్గసూచీని కేంద్ర పర్యాటక శాఖ జూన్‌ రెండో వారానికి సిద్ధం చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన సహకారం అందితే పనుల్ని మూడేళ్లలో పూర్తి చేయాలని పర్యాటక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనుల వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాలూ లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...