Jump to content

Adani sole bidder for Bhavanapadu port


AnnaGaru

Recommended Posts

వరలో ‘భావనపాడు’కు శంకుస్థాపన 

 

భూ సేకరణకు కొద్ది రోజుల్లో మరో నోటిఫికేషన్‌ 
  రైతులకు మెరుగైన పరిహారంపై ప్రభుత్వ పరిశీలన

ఈనాడు, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)లో రూ.3,725 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే భావనపాడు పోర్టుకి నెలాఖరులో శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రితో చర్చించాక తేదీని ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2,050 ఎకరాల్లో 14 బెర్త్‌లతో చేపట్టే పోర్టు నిర్మాణానికి అదానీ గ్రూపు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు, మర్రిపాడు, వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునాల్తాడలో రైతుల నుంచి భూ సేకరణకు 2015లో చేసిన ప్రకటన (నోటిఫికేషన్‌) రెండేళ్ల గడువు ముగియడంతో ఇటీవలే రద్దయ్యింది. రెండు రోజుల క్రితం భావనపాడులో రైతులతో మంత్రి అచ్చెన్నాయుడు, పార్లమెంట్‌ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, పోర్టుల సంచాలకులు నిర్వహించిన సమావేశం తరువాత భూ సేకరణ, పునర్నిర్మాణం, పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ కోసం మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భావనపాడు, దేవునల్తాడ గ్రామాలను పూర్తిగా    తొలగించి, మర్రిపాడులో 1,200 ఎకరాలకుపైగా భూములను సేకరించాల్సి ఉంది. ప్రోత్సాహకరమైన ప్యాకేజీ అందించాలన్న బాధిత రైతుల సూచనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసి నెలాఖరులోగా పోర్టుకు శంకుస్థాపన చేయాలని అధికారులు యోచిస్తున్నారు.   భూ సేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించాలని టెండర్‌ దక్కించుకున్న అదానీ గ్రూపు యోచిస్తోంది. భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి అప్పగిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...