Jump to content

Siggu leni batuku


Alapati's

Recommended Posts

ప్రతిపక్ష నేత జగన్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌ గురువారం అర్థరాత్రి నందిగామ వచ్చారు. కూచి లోకేశ్‌ అనే విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్లారు. లోకేశ్‌ తల్లిదండ్రులను ఓదార్చుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో లోకేశ్‌ బాబాయి హనుమంతరావు జోక్యం చేసుకొని.. ‘ఈ సమయంలో రాజకీయాలు ఎందుకు సార్‌’ అని వారించే ప్రయత్నం చేశారు. అయినా జగన్‌ విమర్శలు కొనసాగించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ప్రభుత్వ పెద్దలు ఇసుక దోపిడీ చేయడం వల్లే నదిలో గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. దీనిపై స్పందించిన హనుమంతరావు.. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం ఏమీ లేవని, ఘటన జరిగిన వెంటనే మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించి సహాయ చర్యలు చెప్పారు. సీఎం రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని, ఘటన జరిగిన మర్నాడే ఆ మొత్తాన్ని మంత్రి దేవినేని అందజేశారని చెప్పారు. ఇసుక గుంతలు ఈనాటివి కావని, వైఎస్‌ హయాంలో ఇసుక పాటలు నిర్వహించడంతో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వుకోవడంతో నదిలో గుంతలు పడ్డాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్న మీరు ఏమి చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామన్నారు. అయినా, త్వరలో తమ పార్టీ నాయకులు వచ్చి బాధిత కుటుంబాలకు సాయం అందిస్తారని చెప్పారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్న మీరు ఏమి చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ స్పందిస్తూ..
:terrific: :terrific:
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...