sonykongara Posted December 13, 2018 Author Posted December 13, 2018 అందమైన లోకముంది.. బీచ్ పర్యటకానికి పెద్దపీట రూ.140 కోట్లతో ప్రతిపాదనలు సమగ్ర నివేదిక సమర్పణ మచిలీపట్నం, న్యూస్టుడే మంగినపూడి బీచ్ కేంద్రంగా నీటి మీద తేలియాడే రిసార్టు, అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యటకులకు ఆకట్టుకొనే దిశగా రూ.140 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెరికా టెక్సాస్ రాష్ట్రానికి చెందిన హైసీ నావల్ ఆర్కిటెక్ట్స్ (హెచ్ఎస్ఎన్ఏ) సంస్థ సమగ్ర నివేదిక మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడ)కు సమర్పించింది. ఆ ప్రతిపాదన కార్యాచరణలోకి వచ్చే విధంగా ముడ చర్యలు చేపడుతోంది. అందరినీ ఆకట్టుకునేలా..: ఆహ్లాదం, ఆనందాలను పంచడమే కాకుండా ప్రధాన ఆదాయవనరుగా ఉండటంతో పాటు విస్తారంగా ఉపాధి అవకాశాలు కల్పించే పర్యటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. నూతన రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజధాని అమరావతికి సమీపంలో ఉండే మంగినపూడి బీచ్ పర్యటక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న మచిలీపట్నం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముడ ఆధ్వర్యాన మచిలీపట్నం పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. బందరుకు ఉన్న పర్యటక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మంగినపూడి బీచ్ అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టారు. * ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన బీచ్ ఫెస్టివల్కు మచిలీపట్నం చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనంత ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో అమెరికా టెక్సాస్లో ఉంటున్న ప్రవాసాంధ్రులకు చెందిన హెచ్ఎస్ఎన్ఏ సంస్థ మంగినపూడి తీరంలో ఉన్న అనుకూలతలతో బీచ్ ఆధారిత పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. నీటిమీద తేలియాడే రిసార్టులు, బీచ్ తీరంలో ఎమ్యూజ్మెంట్ పార్కులు, రిసార్టులు, తదితరాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెలకొల్పేందుకు సంసిద్థతను తెలిపింది. * కానూరు సమీపంలో 16.5 ఎకరాలు, పెదపట్నం వద్ద 8 ఎకరాలు సమకూర్చాలని కోరింది. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు రెండు పాంత్రాల్లో పర్యటించి అక్కడి వనరులు, ఫ్లోటెల్ మెరైన్ రిసార్టుకు ఉన్న సానుకూలతపై సంతృప్తి వ్యక్తం చేశారు. * రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్య పర్యటక కేంద్రంగా రూపుదిద్దుకొనే అవకాశాలను క్రోడీకరించుకున్న సంస్థ అందుకు తగ్గ విధంగా సిద్ధం చేసిన సమగ్ర నివేదికను ముడకు సమర్పించింది. హౌస్బోట్లు, రివర్ ఫ్రంట్ రిసార్టులు, మిని గోల్ఫ్ కోర్టు, వాటర్ టాక్సీలు, బీచ్ ఫ్రంట్ రిసార్టులు, జెట్ స్కైలు, తదితర అత్యానిధుక వసతులతో కూడిన తమ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇస్తే ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది నవంబరు నాటికి పూర్తిచేస్తామని సంస్థ ప్రతినిధులు డీపీఆర్ ద్వారా స్పష్టం చేశారు. కార్యాచరణ దిశగా ముడ పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చొరవకు అనుగుణంగా ముడ ఛైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు కార్యాచరణ వేగవంతం చేశారు. వీటికి సమాంతరంగా పర్యటక అభివృద్ధి దిశగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. హెచ్ఎస్ఎన్ఏ సంస్థ ప్రతిపాదించిన స్థలాల విషయంలో ముడ వీసీ విల్సన్బాబు ఇప్పటికే సర్వే చేయించారు. ఆ సంస్థ కోరిన ప్రభుత్వ భూములు అప్పగించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో, సంస్థ సమర్పించిన డీపీఆర్ను ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి రవీంద్ర, ముడ ఛైర్మన్ వేదవ్యాస్లు పర్యటక ప్రాజెక్టుపై తగు సమాలోచనలు చేసి ఉన్న దృష్ట్యా త్వరలో బీచ్ వేదికగా ఫ్లోటెల్ మెరైన్ రిసార్ట్సు, ఎమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
sonykongara Posted March 26 Author Posted March 26 పండగ చేస్కో.. మంగినపూడి బీచ్ అభివృద్ధికి అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించి పనులు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతుల కల్పనకు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. By Andhra Pradesh Dist. DeskUpdated : 26 Mar 2025 05:23 IST Ee Font size 2 min read బీచ్ ఫెస్టివల్కు ప్రభుత్వం సన్నద్ధం అభివృద్ధి పనులు చేస్తే పర్యటక సందడే న్యూస్టుడే, మచిలీపట్నం కార్పొరేషన్: మంగినపూడి బీచ్ అభివృద్ధికి అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించి పనులు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతుల కల్పనకు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరవాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బీచ్ అధ్వానంగా తయారైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మళ్లీ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావడంతో ఆశలు చిగురిస్తున్నాయి. 6 కి.మీ రోడ్డు విస్తరించాలి.. మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్కు 10 కి.మీ దూరం ఉంటుంది. తెదేపా ప్రభుత్వం జిల్లా పరిషత్ సెంటరు నుంచి బీచ్ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు రూ.13కోట్లు కేటాయించింది. ఎస్వీహెచ్ ఇంజినీరింగ్ కళాశాల వరకు విస్తరించి డివైడర్ ఏర్పాటు చేశారు. మొక్కలతో తీర్చిదిద్దారు. ఇంకా 6 కి.మీ మేర రోడ్డు విస్తరించాల్సి ఉంది. ఆగిన రూ.140కోట్ల ప్రతిపాదనలు బందరు బీచ్ రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండడంతో నాటి తెదేపా ప్రభుత్వ హయాంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దేశ, విదేశీ పర్యటకులను ఆకట్టుకునేలా రూ.140 కోట్లతో అభివృద్ధి చేయడానికి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన హైసీ నావల్ ఆర్కిటెక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఆ స్థాయి వసతుల కల్పనకు కూడా బీచ్ అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు.రి అంతర్జాతీయ సంస్థ ప్రతినిధుల బృందం సభ్యులు అప్పట్లో బీచ్ను సందర్శించి సానుకూలంగా స్పందించడంతో ఎకో టూరిజం అభివృద్ధి చేయడానికి తగు చర్యలు తీసుకున్నారు. రి డ్రైనేజీ నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలవకుండా చూడడంతో పాటు పర్యటకుల సందర్శన, స్నానాలు చేసేందుకు అన్ని వసతులున్న బీచ్లకు ఈ బ్లూఫ్లాగ్ ధ్రువీకరణపత్రం అందజేస్తారు. రి సాగర సంగమం, మంగినపూడి బీచ్లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. రోజూ బీచ్కు వచ్చే వారు సుమారుగా: 200-500 సెలవు దినాలో అయితే: 1000-1500 పుణ్యస్నానాల సమయంలో: 15వేల నుంచి 20వేల మంది గతంలో బీచ్ ఫెస్టివల్ వచ్చిన సందర్శకులు: లక్ష మళ్లీ ఏర్పాట్లు.. గత బీచ్ ఫెస్టివల్ సమయంలో మ్యూజికల్ నైట్, బైక్రైడ్, గుర్రపుస్వారీ, హెలీరైడ్కు పర్యటకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.అప్పట్లో లక్ష మంది వరకు తరలివచ్చారు. మరోసారి బీచ్ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. నాటి ప్రతిపాదనలు పట్టాలెక్కిస్తాం దేపా హయాంలోనే పర్యటకంగా బీచ్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి అక్కడున్న ఖనిజాలతో కూడిన ఇసుక దోచుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. నాటి ప్రతిపాదనలపై పునః సమీక్షించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కొల్లు రవీంద్ర, మంత్రి
sonykongara Posted May 15 Author Posted May 15 జూన్ మొదటి వారంలో మసులా బీచ్ ఫెస్టివల్ జాతీయ క్రీడలు, సాహస క్రీడల వేదికగా జూన్ మొదటి వారంలో నాలుగు రోజుల పాటు మసులా బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. By Andhra Pradesh Dist. DeskPublished : 15 May 2025 04:33 IST Ee Font size 2 min read ఆర్ట్ డైరెక్టర్ రూపొందించిన వేదిక చిత్రపటాన్ని చూపుతున్న మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి (మచిలీపట్నంరూరల్), న్యూస్టుడే: జాతీయ క్రీడలు, సాహస క్రీడల వేదికగా జూన్ మొదటి వారంలో నాలుగు రోజుల పాటు మసులా బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం మంగినపూడి బీచ్ను సందర్శించిన ఆయన ఫెస్టివల్ కోసం జరుగుతున్న పనులు, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలను పరిశీలించి మాట్లాడారు. మంగినపూడి బీచ్ అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతంగా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతా మన్నారు. ఉత్సవాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రమణ వంకను పిలిపించామన్నారు. జాతీయ క్రీడలైన బీచ్ కబడ్డీ, కయాకింగ్ జలక్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ క్రీడల్లో 2వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్, నీటిలో గ్లైడింగ్, స్కూబా డైవింగ్, స్పీడ్బోట్లు వంటి సాహస క్రీడలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ రకాల వంటకాలను పర్యాటకులకు రుచి చూపిస్తామని చెప్పారు. పర్యాటకుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ సినీ కళాకారులు, సంగీత దర్శకులతో సంగీత విభావరి నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలకు సీఎం చంద్రబాబు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మంత్రి పర్యటనలో మచిలీపట్నం ఆర్డీవో కె.స్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, తహసీల్దార్లు హరినాథ్, నాగభూషణం, సీఐ ఏసుబాబు, విద్యుత్తు శాఖ డీఈ రామకృష్ణ, ఆర్ అండ్ బీ డీఈ సంగీత తదితరులు పాల్గొన్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now