Jump to content

Chintu Mother & Father suicide


Andhra Dada

Recommended Posts

చిత్తూరు : మేయర్ అనురాధా దంపతుల హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ తల్లిదండ్రులు గురువారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చింటూ తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

రెండు రోజుల క్రితం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కటారి అనురాధను ఐదుగురు దుండగులు బురఖాలో వచ్చి పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరిపారు. ఆ వెంటనే ఆమె భర్త మోహన్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా మోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు అనురాధ దంపతులకు అంత్యక్రియలు జరుగనున్నాయి.

 

Father died anta....mother serious condition....etupothundi ee case asalu ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...