బైకు ఉన్నా... ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా అనర్హులే
తెలుగు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి అర్హులే. ఆ రేషన్ కార్డుపై ఫొటోలో ఉన్న సభ్యులందరికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.
అలా ప్రస్తుతం తెలంగాణలో 77.19 లక్షల కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్లో 1.42 కోట్ల కుటుంబాలు ఈ పథకాల కిందకు వస్తున్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వ పథకానికి లబ్ధిదారుల ఎంపిక తీరు గందరగోళంగా ఉంది. రేషన్ కార్డుల్ని కాకుండా, 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనగణన ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనం ఉన్నా... ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా... ల్యాండ్ ఫోన్ ఉన్నా... ఆ కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదు.
కుటుంబంలో ఒక్కరు నెలకు రూ.10 వేలకు మించి సంపాదిస్తున్నా ఆ కుటుంబం ఈ పథకం కిందకు రాదు.
Topic closed