Jump to content

New arrests


rajanani

Recommended Posts

టీడీపీ నేత పట్టాభి కదలికలపై పోలీసుల నిఘా

విజయవాడ: టీడీపీ నేత పట్టాభిరామ్‌ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆయన ఇంటి వద్ద కొందరు పోలీసుల పహారా కాస్తున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని పట్టాభి ఆరోపించారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, ఆ కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. గత కాంట్రాక్ట్‌ను తప్పించి.. విజయసాయిరెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్‌ల కాంట్రాక్టును కట్టబెట్టారని పట్టాభి ఆరోపించారు. అయితే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్‌ని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలాఉండగా, తన కదలికలపై పోలీసులు నిఘా పెట్టడంపై పట్టాభి తీవ్రంగా స్పందించారు. అవినీతిపై ఆధారాలు బయటపెడితే పోలీసులు విజయసాయిరెడ్డి ఇంటి వద్దకు వెళతారని భావించాను కానీ.. తన వద్దకు వస్తారని అనుకోలేదన్నారు. పోలీసులు తప్పు చేసిన వాళ్ల వద్దకు వెళ్లాల్సిందిపోయి.. అవినీతిని బహిర్గతం చేసిన తన ఇంటికి రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పట్టాభి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వ చర్యలన్నీ ఇలాగే ఉంటాయని విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే తప్పు చేసిన వాళ్లు శిక్షించబడతారని, రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టే.. తప్పును బయటపెట్టిన వారు శిక్షింపబడతారని వ్యాఖ్యానించారు. 

Link to comment
Share on other sites

నాతవరంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికేనంటున్న స్థానిక పోలీసులు

ఓ టీడీపీ నేత అరెస్టు ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పంపారని ప్రచారం

నాతవరం/విశాఖ(ఆంధ్రజ్యోతి) : విశాఖ నుంచి ఆదివారం సాయంత్రం స్పెషల్‌ పార్టీ పోలీసులు  నాతవరం వచ్చి ఎస్సీ బాలుర వసతి గృహంలో బస చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐదు రోజుల క్రితం ఇక్కడి బ్రహ్మల కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడికి స్పెషల్‌ పార్టీ వచ్చినట్టు స్థానిక పోలీసులు చెపుతున్నా... వేరే కథనం ప్రచారంలో ఉంది.  ఉత్తరాంధ్రకు చెందిన ఒక టీడీపీ నాయకుడ్ని సోమవారం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని, ఈ తరుణంలో ఎటువంటి అల్లర్లు జరుగకుండా ముందస్తు జాగ్రత్తగా వీరిని ఇక్కడికి పంపించారని చెప్పుకుంటున్నారు. 

Link to comment
Share on other sites

ఇద్దరు తెదేపా సానుభూతిపరుల అరెస్టు 

అమరావతి : ఇద్దరు తెలుగుదేశం సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో నలంద కిశోర్‌ అనే వ్యక్తిని ఈ తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసిన కారణంగా అరెస్టు చేశారు. తన ఆరోగ్యం సరిగ్గా లేదని.. ఉదయం వస్తానని చెప్పినా పోలీసులు వినలేదని కిశోర్‌ బంధువు చెబుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిశోర్ అనుచరుడు కావడంతో ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రచారంలో ఉన్న పోస్టులను నలంద కిశోర్ ఫార్వర్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే విశాఖలోని సీఐడీ కార్యాలయానికి మాజీ మంత్రి గంటా చేరుకున్నారు. కిశోర్‌ని మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. 

మరోవైపు కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా సోషల్‌ మీడియా కార్యకర్త కృష్ణారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని విజయవాడ తరలించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...