sonykongara Posted September 22, 2018 Share Posted September 22, 2018 ప్రజా పెట్టుబడి అమరావతి కోసం నవంబరులో సీఆర్డీఏ రీటెయిల్ బాండ్లు రూ.100 ముఖ విలువతో జారీ రూ.500 కోట్లు సమీకరించడమే లక్ష్యం కాలపరిమితి 3-15 ఏళ్లు! సాధారణ ప్రజలు మదుపు చేసే అవకాశం సంస్థాగత బాండ్లకంటే ఎక్కువ వడ్డీ? ఈనాడు - అమరావతి రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి రూ.500 కోట్లను రీటెయిల్ బాండ్ల ద్వారా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. రీటెయిల్ బాండ్ల ద్వారా ఒకే విడతలోగానీ, రెండు మూడు విడతల్లో గానీ రూ.500 కోట్లను సీఆర్డీఏ సమీకరించనుంది. ఒక్కో బాండు ముఖ విలువ రూ.100. సాధారణ ప్రజలు దీనిలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశముంటుంది. అమరావతి బాండ్లద్వారా సంస్థాగత మదుపరుల నుంచి ఇప్పటికే సీఆర్డీఏ రూ.2 వేల కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారికి సీఆర్డీఏ 10.32 శాతం వడ్డీ ఇస్తోంది. రీటెయిల్ బాండ్లకు కూడా వడ్డీ రేటు దాదాపు అంతే ఉంటుందని, ఇది పెరిగే అవకాశం కూడా ఉందని సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి.అమరావతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్న ఆకాంక్షతోపాటు, బాండ్లపై వడ్డీ రేటు కూడా ఆకర్షణీయంగా ఉండటంతో సాధారణ ప్రజలు, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు చెందినవారుఈ బాండ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని, నవంబరు నెలాఖరుకి బాండ్లు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. రూ.500 కోట్లే ఎందుకు? సంస్థాగత బాండ్లలో కనీస పెట్టుబడిని రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ట్రేడింగ్ అయిన గంట వ్యవధిలోనే అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు సమకూరాయి. సంస్థాగత మదుపరుల నుంచి మళ్లీ నిధులు సమీకరించేందుకు అవకాశమున్నా... అమరావతి నిర్మాణంలో ప్రజల్నీ భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంలో భాగంగా రీటెయిల్ బాండ్లు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థాగత బాండ్లతో పోలిస్తే రీటెయిల్ బాండ్లు నిర్వహించడం చాలా కష్టమైన పని. సెబీ, ఆర్బీఐ నిబంధనలూ కఠినతరంగా ఉంటాయి. ముఖ విలువ తక్కువ కాబట్టి వేల సంఖ్యలో మదుపరులు ఉంటారు. అందుకే ప్రస్తుతానికి రూ.500 కోట్లకే పరిమితం కావాలని, ప్రజల నుంచి వచ్చే స్పందనబట్టి మరోసారి పబ్లిక్ ఇష్యూకి వెళ్లడంపై నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ భావిస్తోంది. రీటెయిల్ బాండ్ల కాల పరిమితి మూడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉండే అవకాశముంది. ఈ బాండ్లకు సంబంధించిన ప్రక్రియను సీఆర్డీఏ ఇప్పటికే ప్రారంభించింది. బాండ్ల జారీ ప్రక్రియను నిర్వహించే సంస్థను (లీడ్ మేనేజర్) ఎంపిక చేయడానికి టెండరు జారీ చేసింది. ఈ నెల 24న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తున్నారు. బాండ్లపై అప్పుడు పూర్తి స్పష్టత వస్తుందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. మిగతా పెట్టుబడులకంటే ఎక్కువ లబ్ధి? ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపుపై ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి వివిధ చిన్న మొత్తాల పథకాల్లో వడ్డీ రేట్లు కొంచెం పెరగనున్నాయి. మరోపక్క డాలర్తో రూపాయి మారకం విలువ కూడా తగ్గింది. ఆ నేపథ్యంలో అమరావతి బాండ్లలో సంస్థాగత మదుపరులకు ఇచ్చిన వడ్డీ కంటే రీటెయిల్ ఇన్వెస్టర్లకు ఇచ్చే వడ్డీ రేటు కొంత పెరిగే అవకాశం ఉందని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. సంస్థాగత బాండ్లను ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేస్తే 10.55 శాతం వరకు వడ్డీ రేటు ఇవ్వాల్సి వచ్చేదని ఆయన పేర్కొన్నారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, స్థిరాస్తి, బంగారం వంటి పెట్టుబడి మార్గాలను పక్కన పెడితే... సాధారణ ప్రజలు ఎక్కువగా బ్యాంకుల్లోను, చిన్న మొత్తాల పొదుపు సంస్థల్లోను మదుపు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం, కొన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలోను పెట్టుబడి పెడతారు. వీటితో పోల్చితే సీఆర్డీఏ బాండ్లతో వడ్డీ లబ్ధి ఎక్కువగా ఉంటుంది. Link to comment Share on other sites More sharing options...
minion Posted September 22, 2018 Share Posted September 22, 2018 I know risk of default is there ... but, risk adjusted return seems good to me ... esp if TDP comes back to power ... may be its time to put some money where my mouth spouts ... Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted September 22, 2018 Share Posted September 22, 2018 I am IN Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.