Jump to content

పేపర్ బాయ్.. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు.. ఇప్పుడు MLA!


kumar_tarak

Recommended Posts

రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అయితే అది నిజం కాదని నిరూపించాడు ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ బొజ్జు. ఇప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే నివాసముంటున్న బొజ్జు.. నేడు ఆ పార్టీ ఇచ్చిన టికెట్‌పై పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు పటేల్‌ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్‌లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు. ఆదివాసీ గోండు బిడ్డ అయిన వెడ్మ బొజ్జుది సామాన్య నేపథ్యం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మబొజ్జు పటేల్‌. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసముంటున్నారు.

పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో.. తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ)లో సలహాదారుడిగా, అనంతరం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అధిష్ఠానం దృష్టిని ఆకర్షించి ఖానాపూర్‌ టికెట్‌ దక్కించుకున్నారు. తనకు రూ.8.42 లక్షలు అప్పులున్నాయని నామినేషన్‌లో పేర్కొన్నారు. తాను ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. బొజ్జు చదువుకునే సమయంలో పేపర్ బాయ్‌గాను పని చేశారు.

ఖానాపూర్‌ నియోజకవర్గం ఏర్పడ్డాక గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోట్నాక్‌ భీంరావు ఒక్కరే ఇక్కడ విజయం సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బొజ్జు రికార్డు సృష్టించారు.

Link to comment
Share on other sites

4 hours ago, kumar_tarak said:

రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అయితే అది నిజం కాదని నిరూపించాడు ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ బొజ్జు. ఇప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే నివాసముంటున్న బొజ్జు.. నేడు ఆ పార్టీ ఇచ్చిన టికెట్‌పై పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు పటేల్‌ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్‌లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు. ఆదివాసీ గోండు బిడ్డ అయిన వెడ్మ బొజ్జుది సామాన్య నేపథ్యం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మబొజ్జు పటేల్‌. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసముంటున్నారు.

పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో.. తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ)లో సలహాదారుడిగా, అనంతరం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అధిష్ఠానం దృష్టిని ఆకర్షించి ఖానాపూర్‌ టికెట్‌ దక్కించుకున్నారు. తనకు రూ.8.42 లక్షలు అప్పులున్నాయని నామినేషన్‌లో పేర్కొన్నారు. తాను ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. బొజ్జు చదువుకునే సమయంలో పేపర్ బాయ్‌గాను పని చేశారు.

ఖానాపూర్‌ నియోజకవర్గం ఏర్పడ్డాక గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోట్నాక్‌ భీంరావు ఒక్కరే ఇక్కడ విజయం సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బొజ్జు రికార్డు సృష్టించారు.

Seetha Akka lekka Iithanu kuda mari peru techhu kovali 🙏🙏

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...