Jump to content

పర్యాటకాభివృద్ధిలో ఏపీకి దేశంలోనే తొలి స్థానం


sonykongara

Recommended Posts

పర్యాటకాభివృద్ధిలో ఏపీకి దేశంలోనే తొలి స్థానం
28-09-2018 06:41:54
 
636737137167645870.jpg
అమరావతి: పర్యాటకాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ చేతుల మీదుగా ఏపీకి వచ్చిన అవార్డును ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ అందుకున్నారు. సహజ, జీవావరణం, సాంస్కృతికానికి సంబంధించిన పర్యాటక ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కేంద్రం ప్రశంసించింది. అవార్డు అందుకున్న సందర్భంగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ విలేకరులతో మాట్లాడుతూ... పర్యాటక రంగంలో వరుసగా రెండోసారి ఆంధ్రప్రదేశ్‌కు జాతీయస్థాయిలో ప్రథమ పురస్కారం రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. మరోవైపు, టూరిస్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్‌ కేటగిరీలో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగువారి ‘రావు ట్రావెల్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌’ సంస్థకు మొదటి ప్రైజ్‌ లభించింది. ఈ అవార్డును ఆ సంస్థ ప్రతినిధులు ఎస్‌.సుబ్బారావు, ఎస్‌.శ్రీనివాసరావు అందుకున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...