Jump to content

CBN tweet


Recommended Posts

అనారోగ్యం పాలైనప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల కోసం, చికిత్స కోసం డబ్బును ఖర్చుచేసి అప్పుల పాలవుతున్న పేదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 పట్టణాల్లో 222 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి ఏసీ గదుల్లో చికిత్స అందించడమే కాకుండా 30 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తోంది. మందులను సైతం ఉచితంగా అందిస్తోంది. చంద్రన్న సంచార వైద్యశాలల పేరిట నెలకు ఒకసారి ప్రతి గ్రామాన్ని సందర్శించి, వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసేలా 273 సంచార వైద్యశాలలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలో 72 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. అయితే ఏంటో ఖరీదైన సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ లను ఉచితంగా నిర్వహించడం దేశంలోనే ప్రధమం.

ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, గూడూరు ఏరియా ఆసుపత్రి, చీరాల ఏరియా ఆసుపత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఏరియా ఆసుపత్రి, హిందూపురం జిల్లా ఆసుపత్రి, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, నంద్యాల జిల్లా ఆసుపత్రి, అనకాపల్లి ఏరియా ఆసుపత్రి, ఏలూరు జిల్లా ఆసుపత్రులలో ఈ సేవలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు 32,957 మందికి సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...