Jump to content

‘ఉదయ్‌’లోనూ ముందుండండి


sonykongara

Recommended Posts

  • మార్గదర్శకాలు పరిశీలించి ఎంఓయూకు సిద్ధంకండి 

  • అజయ్‌జైనతో కేంద్ర ఇంధన శాఖ అదనపు కార్యదర్శి 

హైదరాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఇంధన శాఖ వినూత్నంగా చేపట్టదలచిన ‘ఉజ్వల్‌ డిస్కమ్‌ ఎస్యూరెన్స యోజన - ఉదయ్‌’ను అందుకోవడంలో ముందుండాలని ఏపీని కేంద్రం కోరింది. ఏపీ ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి అజయ్‌జైనకు కేంద్ర ఇంధన శాఖ అదనపు కార్యదర్శి బీఎన శర్మ మంగళవారం ఫోన చేశారు. కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాలనూ అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న ఏపీ.. ఉదయ్‌ విషయంలోనూ అగ్రస్థానంలో ఉండాలని కోరారు. ఈ పథకం వల్ల డిస్కమ్‌లపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు పరిశీలించి ఎంఓయు చేసుకోవాని అజయ్‌జైనకు శర్మ సూచించారు. దీంతో.. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా జెనకో ఎండీ ట్రాన్సకో సీఎండీ కె.విజయానంద్‌కు అజయ్‌ జైన్‌ సమాచారం అందించారు. డిస్కమ్‌లు తీసుకున్న రుణాలలో 75 శాతం రాష్ట్రం భరించడం వల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకూ వాటికి ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రుణాలకు బాండ్లు తీసుకోవడం వల్ల .. ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయింపు ఉంటుందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21న కృష్ణపట్నంలో ఎల్‌ఈడీ బల్బులను కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ పంపిణీ చేస్తారు. అదే రోజు కృష్ణపట్నం రెండు యూనిట్లను జాతికి అంకింతం చేసి 800 మెగావాట్ల మూడో యూనిట్‌కు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొంటారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...