Jump to content

optical fiber grid


sonykongara

Recommended Posts

నాలుగు నెలల్లో ఉత్తరాంధ్రకు ప్రభుత్వ ఇంటర్నెట్‌

Updated :27-10-2015 23:20:18 print_icon.gif

 
  •  రూ.5,000 కోట్లకు పెరిగిన అంచనాలు 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర జిల్లాలకు త్వరలో చౌకగా ప్రభుత్వ ఇంటర్‌నెట్‌ సేవలు అందబోతున్నాయి. ఇందుకు సంబంధించిన పైబర్‌ గ్రిడ్‌ కార్యక్రమాలను నాలుగు నెలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఇన్‌క్యాప్‌ భావిస్తోంది. ఇందుకోసం భూగర్భ కేబుల్‌ వ్యవస్థకు భిన్నంగా, ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉండే విద్యుత్తు స్తంభాలకు పైబర్‌ నెట్‌ వైర్లను ఏర్పాటు చేస్తారు. దీంతో తక్కువ ఖర్చుతో గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించవచ్చని ఇన్‌క్యాప్‌ నిర్ణయించింది. తొలిదశలో చేపట్టే ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ (బిబిబి) పథకం ద్వారా నిధులు అందిస్తోంది. రాష్ట్రంలో చేపట్టే ఈ కార్యక్రమానికి తొలి దశలో రూ.330 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సేవలను చౌకగా అందిస్తే .. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ ధరలు ప్రామాణికంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కాగా.. రెండో దశ భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.300 కోట్లు సరిపోతాయని భావించారు. అయితే ప్రస్తుతం అది రూ.5000 కోట్లకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మొదటి దశ ఫైబర్‌గ్రిడ్‌ కార్యక్రమం పూర్తయ్యాక .. రెండో దశకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...