Jump to content

వాడివేడిగా కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం


JAYAM_NANI

Recommended Posts

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 : జలసౌధలో కృష్ణా రివర్‌బోర్డు సమావేశం వాడివేడిగా సాగుతోంది. శ్రీశైలం విద్యుదుదత్పత్తిపై ఇరు రాష్ర్టాలకు చెందిన చీఫ్‌ ఇంజనీర్లు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడవ కాలువలో విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి భినాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

నిబంధనల మేరకే శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని తెలంగాణ చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ తెలిపారు. 69, 107, 233 జీవోల ప్రకారమే విద్యుదుత్పత్తి చేస్తున్నామని, నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని మురళీధర్‌ తన వాదనలో పేర్కొన్నారు.

 

అయితే దీనిపై ఏపీ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని, అత్యవసర పరిస్థితుల్లోనే విద్యుదుత్పత్తి చేయాలని వెంకటేశ్వర్లు వాదించారు. శ్రీశైలం ఎడమ కాలువ నుంచి కేవలం సాగు, తాగు నీటిని వినియోగించుకోవాలన్న ఆయన రాష్ట్రంలో అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడే ప్రాజెక్టు 857 అడుగుల మేర నీటి సామర్థ్యాన్ని చూసుకుని దానిపై ఉన్నటువంటి నీటితో మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నారు.

 

ఆ నీటిని సైతం తిరిగి శ్రీశైలంలోకి వెళ్లేలా చూడాలని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలో బోర్డు చైర్మన్‌ పండిట్‌ జోక్యం చేసుకుని వాదనలు మాత్రమే వినిపించాలని ఇరువురు ఇంజనీర్లను వారించినట్లు తెలుస్తోంది. మరో గంటకు పైగా సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...