ఒంగోలులో నారా లోకేశ్ యువగళం సభ
ఒంగోలులో లోకేశ్ యువగళం సభ
తెదేపా హయాంలో జిల్లాలవారీగా ప్రాధాన్యం కల్పించాం: లోకేశ్
నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం
కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి
ప్రజల తరఫున పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు
ప్రజల తరఫున పోరాడితే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు
వైకాపా చేసిన తప్పులను ప్రజల ముందుంచాం
ప్రకాశం జిల్లా అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం
అమరావతి: ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు.
రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు.‘‘ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్ తెలిపారు.
ఎన్డీయే హామీల్లో ముఖ్యాంశాలివే..