జనసేన టీడీపీ పొత్తు ధర్మం పాటిస్తామని మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పేర్కొన్నారు.టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లు టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్ధుల తొలి జాబితాలో మండపేట నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్ధిగా వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రకటించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట జనసేనపార్టీ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ ను కలిశారు. కపీలేశ్వపురం మండలం వల్లూరు గ్రామంలో లీలా స్వగృహం వద్ద ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేయాలని కోరారు. లీలా కృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి పారద్రోలటానికి కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు కలసి పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, గడి రాంబాబు, వల్లూరి వీరబాబు, గుణ్ణం సుబ్బరాజు, వాదా ప్రసాద రావు, నరిగిరి బాపయ్య, శిరంగి ఈశ్వరరావు, గారపాటి హరికృష్ణ, తదితర్లు పాల్గొన్నారు.