Jump to content

AP TDP Office in Mangalagiri


sonykongara

Recommended Posts

ఏపీలో  తెదేపా నూతన కార్యాలయానికి శంకుస్థాపన
26BRK29-SR1.jpg

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తెదేపా కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం తెల్లవారుజామున శంకుస్థాపన చేశారు. ఉదయం 5.17 నిమిషాలకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఉండవల్లి సమీపంలో ముఖ్యమంత్రి నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్‌ హాలును కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ విభాగం అధ్యక్షుడు రమణ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు.

 2018 డిసెంబరు నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం కోసం 3.60 ఎకరాల విస్తీర్ణంలో 3 భవనాలు నిర్మిస్తున్నారు. పరిపాలనా భవనం జీ+4 అంతస్తులతో నిర్మిస్తారు. ఐదో అంతస్తులో పార్టీ జాతీయఅధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, 4వ అంతస్తులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలుంటాయి.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...