Jump to content

కేసీఆర్‌కు నోబెల్‌ పురస్కారం ఇవ్వాలి.....


KING007

Recommended Posts

కేసీఆర్‌కు నోబెల్‌ పురస్కారం ఇవ్వాలి 

‘భారతరత్న’ కూడా తక్కువే ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: కేసీఆర్‌కు ‘శాంతిదూత’ బిరుదే కాదు.. ‘భారతరత్న’ ఇచ్చినా తక్కువేనని, పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడా రక్తంచుక్క చిందకుండా అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారని, అలాంటి మహాత్ముడికి నోబెల్‌ శాంతి పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఏడీజేఏసీ) ఆధ్వర్యంలో కేసీఆర్‌కు ‘శాంతిదూత’ బిరుదు ప్రదానోత్సవాన్ని బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కేసీఆర్‌ పక్షాన బిరుదును స్వీకరించిన మహమూద్‌ అలీ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆటోడ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని, సంతృప్తికర సేవలను అందిస్తే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయని హితవు పలికారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ... ఆటో డ్రైవర్లంతా విడిపోకుండా.. ఒక తాటిపైకొచ్చి తమ శక్తిని ప్రదర్శిస్తే.. కచ్చితంగా ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు. ఆటోడ్రైవర్ల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. ఐకాస కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. తెరాస రాష్ట్ర నేత మోతే శోభన్‌రెడ్డి, కేసీఆర్‌ సేవాదళం అధ్యక్షుడు మహ్మద్‌ అమీర్‌ మాట్లాడారు.

Link to comment
Share on other sites

adedo cinemalo Oscar Awards raakunda tokkestunnarani... Brahmi tanaku tane Baskar awards ichukunnattu.. ee Auto Sanghalu vaallu kuda Bharata Ratna ki badulu.. Bakara Ratna ani maro award icheste sari. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...