Jump to content

Sandalwood smugler Veerappan acquitted in RajKumar Kidnap ???


swarnandhra

Recommended Posts

రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో వీరప్పన్ దోషి కాదు.!
26-09-2018 21:53:59
 
636735956410236133.jpg
చెన్నై: కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో 18ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు  వీరప్పన్‌తో సహా మిగిలినవారందరినీ  నిర్దోషులుగా తేల్చింది తమిళనాడులోని గోపిచెట్టిపాళయం కోర్టు. వివరాల్లోకి వెళితే... 2000 జూలైలో తన కుటుంబ సభ్యులతో పాటు దొడ్డ గజనూర్ గ్రామంలోని ఫాంహౌస్‌కి వెళ్లారు రాజ్‌కుమార్. ఇది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడి నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు వీరప్పన్. అనంతరం రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మాల్ ఫిర్యాదుతో వీరప్పన్‌తో పాటు 14 మందిపై కేసు నమోదైంది. సత్యమంగళం అటవీప్రాంతంలో 108 రోజులు పాటు వీరప్పన్ చెరలో రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్ కిడ్నాప్ ఉదంతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ప్రముఖ జర్నలిస్ట్ నక్కిరన్ గోపాల్ రాయబారంతో రాజ్ కుమార్ విడుదలయ్యారు.
 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరప్పన్, అతని మరో ఇద్దరు కీలక అనుచరులు .. తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో 2004లో జరిపిన ‘ఆపరేషన్ కుకూన్‌’లో చనిపోయారు. ఇదిలా ఉంటే 2006లో రాజ్ కుమార్, 2017లో ఆయన సతీమణి పార్వతమ్మాళ్ కన్నుమూశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...