sonykongara Posted August 15, 2018 Share Posted August 15, 2018 విజయవాడలో క్రికెట్ ఫీవర్15-08-2018 07:47:51 విజయవాడ చేరుకున్న క్రీడా బృందాలు అసోసియేషన్ నేతల ఘనస్వాగతం విజయవాడ: నగరంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం వచ్చిం ది. దేశ, విదేశీ జట్లలో పేరుగాంచిన క్రికెటర్లు గన్నవరం ఎయిర్పోర్టుకు అక్కడి నుంచి బస ఏర్పాటు చేసిన హోటళ్లకు మంగళవారం చేరు కున్నారు. మూలపాడులో ఈనెల17 నుంచి 29వ తేదీ వరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ సిరీస్ 2018ను నిర్వహించ నున్నారు. ఈ సిరీస్లో పాల్గొనేందుకు ఇండి యా ఏ, బీ జట్లు సభ్యులతో పాటు సౌత్ ఆఫ్రికా ఏ, ఆస్ర్టేలియా ఏ జట్లు కూడా నగరానికి చేరుకున్నాయి. ఆస్ర్టేలియా జట్టుతో పాటు గ్రెగ్ చాపెల్ కూడా విచ్చేశారు. నగరా నికి చేరుకున్న క్రికెటర్లను ఆంధ్రా క్రికెట్ జనరల్ సెక్రటరీ సీహెచ్. అరుణ్కుమార్, ట్రెజరర్ రామచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ త్రినాథరాజు, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ తదితరులు ఆహ్వానం పలికారు. అనంతరం అరుణ్ మాట్లాడుతూ మూల పాడులో జరగనున్న మ్యాచ్లు స్టార్ స్పోర్ట్ నుంచి ప్రసారమవుతాయని చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.