sonykongara Posted March 13, 2018 Share Posted March 13, 2018 ఈశాన్య రాష్ట్రాలకు హోదా పొడిగించలేదా?... నిలదీసిన చంద్రబాబు13-03-2018 17:11:48 అమరావతి: విభజన చట్టంలో ఏమైతే ఉన్నాయో అవి తగిన సమయంలో అమలు చేయాలని కోరిన నేపథ్యంలో కేంద్రమంత్రి అరుణ్జైట్లీ అనాడు మీడియా సమావేశంలో ఏపీకి అన్నీ చేస్తామని చెబుతూనే సెంటిమెంట్తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని చెప్పారని, అదే సెంటిమెంట్తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి హోదా లేదంటూ ఈశాన్య రాష్ట్రాలకు పొడిగించలేదా? అని ప్రశ్నించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, కేంద్రంలో కీలకంగా ఉన్న రోజుల్లో పదవులు అడగలేదని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీలో కఠిన నిర్ణయాలు తీసుకున్నా... రెండోసారి గెలిచామని ఆయన చెప్పారు. ఆర్థిక సంస్కరణల వల్ల లాభాలు వస్తాయని చెప్పింది తానేనని, విభజనతో ఆదాయం కోల్పోయామని ఏపీ ప్రజలు బాధతో ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. సేవారంగంలో జాతీయసగటుతో పోలిస్తే ఏపీ వెనుకబడి ఉందని, సేవారంగం అభివృద్ధి చెందితేనే ఏపీకి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆనాడు బీజేపీ మద్దతివ్వకుంటే విభజన బిల్లు పాసయ్యేది కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలని, ఏపీకి సహకరించే బాధ్యత కేంద్రానికి లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted March 13, 2018 Share Posted March 13, 2018 Tea sellers jac form chesi vaallu demand cheste chestadu veediki as language ardham avvuddi. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.