sonykongara Posted October 14, 2017 Share Posted October 14, 2017 త్వరలో అమరావతికి హెచ్ఆర్సీ14-10-2017 03:23:45 భవనాలను పరిశీలించిన అధికారులు విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) త్వరలో అమరావతికి తరలి రాబోతుంది. ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ విభాగాన్ని వీలైనంత త్వరగా ఇక్కడికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలను అక్కడి నుంచి అమరావతికి తరలించాలని సీఎం చంద్రబాబు పలుమార్లు ఆదేశించారు. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడంతో... అమరావతికి రాని వారి జీతాలు నిలిపివేయాలని ఆదేశించడంతో కదలిక వచ్చింది. ఈ కమిషన్ను ఏర్పాటు చేయడానికి సాధారణ పరిపాలన విభాగం మూడు ప్రాంతాలను సూచించింది. వెలగపూడిలోని సచివాలయానికి సమీపాన ఉన్న కృష్ణయ్యపాలెం, రెడ్డిపాలెం గ్రామాల్లో రెండు భవనాలను చూపించింది. వీలుకాని పక్షంలో విజయవాడ బందరు రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని సూచించింది. వీటిని పరిశీలించడానికి కమిషన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, రిజిష్ట్రార్ కృష్ణారావు, పరిపాలనాధికారి సుధాకర్రెడ్డి శుక్రవారంనాడు విజయవాడకు వచ్చారు. మొన్నటి వరకు జస్టిస్ కక్రూ ఈ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించారు. ఆయనతోపాటు మరో ఇద్దరు సభ్యుల పదవీకాలం కూడా పూర్తయ్యింది. దీంతో, హెచ్ఆర్సీ పూర్తిస్థాయిలో తరలి వచ్చిన తర్వాత కొత్త కమిషన్ను నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 14, 2017 Author Share Posted October 14, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.