sonykongara Posted October 6, 2017 Author Share Posted October 6, 2017 పన్ను తగ్గించినా ధరలు దిగవేం? ప్రజలకు లాభం చేకూరడం లేదు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది ధరల పర్యవేక్షణకు జాతీయ వ్యవస్థ కేంద్రానికి యనమల లేఖ అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నిత్యం ఉపయోగించే అనేక వస్తువులపై జీఎ్సటీ పన్ను తగ్గించినప్పటికీ.. వాటి ధరలు దిగిరావడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదని.. పైగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పన్ను మినహాయింపు లేదా పన్ను తగ్గింపుతో.. ధరలు తగ్గిందీ లేనిదీ పర్యవేక్షించడానికి జాతీయ స్థాయి నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ఎస్జీఎస్టీ, సీజీఎస్టీ, ఐజీఎ్సటీ, సెస్ చెల్లింపుల వివరాలను రియల్టైమ్ ప్రాతిపదికన జీఎ్సటీఎన్ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని అందులో విజ్ఞప్తి చేశారు. ‘చిన్న వ్యాపారులు, ట్రేడర్లకు వెసులుబాటు కల్పించడానికి నెలవారీ రిటర్నుల్లో మినహాయింపు ఇవ్వాలి. అల్పాదాయవర్గాల ప్రజలు వినియోగించే వస్తు, సేవలపై పన్ను మినహాయించాలి. లేదంటే తగ్గించాలి. ప్రభుత్వ పనులు నేరుగా చేసే కాంట్రాక్టర్లపై జీఎ్సటీని 12 శాతానికి తగ్గించినప్పటికీ.. ప్రధాన కాంట్రాక్టర్ల తరపున పనిచేసే సబ్కాంట్రాక్టర్లపై 18 శాతం అమలవుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. అందుచేత సబ్కాంట్రాక్టర్లపై విధించే జీఎ్సటీని కూడా 12 శాతానికి తగ్గించాలని కోరారు. విశాఖపట్నంలోని గిరిజన సహకార కార్పొరేషన్ మార్కెటింగ్ చేస్తున్న తేనె, కాఫీ, పసుపు, సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ, శీకాకాయ షాంపూలు, నన్నారి, బిల్వాషర్బత్లు గిరిజనుల అటవీ ఉత్పత్తులు. వారిని ప్రోత్సహించేందుకు వాటిపై జీఎ్సటీ మినహాయించాలి. బయోడీజిల్పై అమలవుతున్న 18 శాతం పన్నును 5 శాతానికి తగ్గించాలి. చేపలు పట్టే వలలు, వాటికి ఉపయోగించే వస్తువులపై 12 శాతం జీఎ్సటీ అమలవుతోంది. దీనివల్ల కొన్ని లక్షల మంది మత్స్యకారులు జీవనాధారం కోల్పోతున్నారు. అందుచేత వాటిపై జీఎస్టీని మినహాయించాలి’ అని అభ్యర్థించారు. గ్రానైట్ శ్లాబులపై 18 శాతం జీఎస్టీ అమలవుతోందని, దీన్ని ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. నాపరాళ్లపైనా 28 శాతం జీఎస్టీ ఉందని, దానినీ తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పత్తినూలు ఉండలపై 5 శాతం జీఎ్సటీ విధింపుతో చేనేతవర్గం తీవ్రగా నష్టపోతోందని, వీటిని పన్ను నుంచి మినహాయించాలని కోరారు. నాటు పొగాకు చుట్టలపై 28 శాతం పన్ను విధించారని.. 50 రూపాయలున్న సిగరెట్పైన, రూపాయి విలువ గల చుట్టలపైన ఒకే పన్ను రేటు సబబు కాదన్నారు. ట్రాక్టర్లపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. పౌరసరఫరాల సంస్థకు సరఫరా కోసం చేస్తున్న రైస్ మిల్లింగ్పై జీఎ్సటీ అమలవుతుందో లేదో స్పష్టత కావాలన్నారు. నీటిపారుదల శాఖలో కాంట్రాక్టు పనులు, ప్రభుత్వం చేపట్టే ఇతర కాంట్రాక్టు వర్కులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరారు. పర్యావరణహితమైన హైబ్రిడ్ కార్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వీటిపై 28% జీఎస్టీ విధించడంతో పాటు 15 శాతం సెస్ అమలుచేస్తున్నారని, సెస్ను 3 శాతానికి తగ్గించాలని యనమల కోరారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 6, 2017 Author Share Posted October 6, 2017 అయినా ధరలు తగ్గడం లేదు జీఎస్టీ మండలికి యనమల లేఖ ఈనాడు అమరావతి: పలు వస్తువులపై జీఎస్టీ బాగా తగ్గించినప్పటికీ ఆయా వస్తువుల ధరలు మాత్రం తగ్గడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ మేరకు కేంద్ర జీఎస్టీ మండలి ఛైర్మన్కు గురువారం లేఖ రాశారు. ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరల నియంత్రణకు ఒక సమర్థ యంత్రాంగాన్ని అమలు చేయాలని కోరారు. జీఎస్టీ పోర్టల్లో రాష్ట్ర జీఎస్టీ, కేంద్ర జీఎస్టీ పన్నులు ఎంత వసూలు చేశారనే వివరాలను అందుబాటులో ఉంచాలని కోరారు. ఎండు చేపలపైన ఐదు శాతం పన్ను విధించడాన్ని యనమల వ్యతిరేకించారు. గ్రానైట్ రంగంలో అంతా చిన్న పరిశ్రమల వారే ఉన్నారని, వారికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 6, 2017 Author Share Posted October 6, 2017 మిగిలిన చెల్లింపుపై కేంద్రం స్పందించలేదు: యనమల06-10-2017 18:22:20 ఢిల్లీ: రాష్ట్రాలకు పరిహారం చెల్లింపులో వస్తున్న తేడాలను జీఎస్టీ సమావేశం దృష్టికి తీసుకెళ్లామని ఏపీ మంత్రి యనమల తెలిపారు. ఏపీకి పరిహారం కింద 175 కోట్లకు గాను రూ.116 కోట్లు ఇచ్చారన్నారు. మిగిలిన మొత్తం చెల్లింపుపై కేంద్రం స్పందించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. సెస్ రూపంలో రూ.43 కోట్లు ఇచ్చారని యనమల పేర్కొన్నారు. ఈ-వే బిల్లులు లేకపోతే తప్పుడు లెక్కలకు ఆస్కారం ఉంటుందని చెప్పామని ఈ సందర్భంగా యనమల వ్యాఖ్యనించారు. ఈ-వే బిల్లులపై అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయన్నారు. చిన్న పరిశ్రమలకు జీఎస్టీ నుంచి ట్యాక్స్ మినహాయించారని చెప్పారు. పరిమితిని రూ.75 లక్షల నుంచి కోటికి పెంచాలని నిర్ణయించామమన్నారు. గ్రానైట్, కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు జీఎస్టీ మినహాయింపు అంశం చర్చకు రాలేదని యనమల పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 6, 2017 Author Share Posted October 6, 2017 గ్యాస్ స్టవ్లపై జీఎస్టీ తగ్గింపు న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 22వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ స్టవ్లు, వినియోగదారుల వస్తువులను 28 శాతం పన్ను పరిథి నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గృహ వినియోగ వస్తువుల ధరలు తగ్గవచ్చునని అంచనా. ఏసీ రెస్టారెంట్లపై ఇకపై 12 శాతం పన్ను విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 22వ సమావేశం శుక్రవారం జరిగింది. చిన్న వ్యాపారులకు ట్యాక్స్ ఫైలింగ్ విధానాన్ని సులభతరం చేయాలని కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. కంపోజిషన్ స్కీమ్ను రూ.75 లక్షల నుంచి రూ.1.5 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ స్కీమ్లో భాగంగా వ్యాపారులు నిర్ణీత రేటు ప్రకారం పన్ను చెల్లించవలసి ఉంటుంది. 1-5 శాతం పన్ను విధించే అవకాశం ఉంది. దీని ప్రకారం వ్యాపారులు చెల్లించాలి. రిటర్నుల దాఖలును మూడు నెలలకు పెంచాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా రిటర్నులను ఫైల్ చేయవలసిన అవసరం ఉంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 7, 2017 Author Share Posted October 7, 2017 Link to comment Share on other sites More sharing options...
ask678 Posted October 7, 2017 Share Posted October 7, 2017 Corporator range PM, municipal ward member level Finamce minister... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 7, 2017 Author Share Posted October 7, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 7, 2017 Author Share Posted October 7, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 7, 2017 Author Share Posted October 7, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 7, 2017 Author Share Posted October 7, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 7, 2017 Author Share Posted October 7, 2017 Link to comment Share on other sites More sharing options...
ask678 Posted October 7, 2017 Share Posted October 7, 2017 B odi dances Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 17, 2017 Author Share Posted October 17, 2017 జీఎస్టీ రేట్ల సవరణపై నోటిఫికేషన్లు అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పలు రకాల వస్తువులకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ సవరించిన శ్లాబ్రేట్లకు రాష్ట్ర ప్రభుత్వం పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. చింతపండు, వాల్నట్స్, ఆకులు, గడ్డితో తయారుచేసే వస్తువులు, చీరల ఫాల్స్ తదితర పలు రకాల వస్తువులకు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులతో కేంద్రం శ్లాబులు మార్చింది. ముతకనూలుకు సంబంధించి అదనపు ఐటీసీ రీఫండ్బుల్ కాదంటూ జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. రిజిస్ట్రేషన్ కలిగిన చేనేత తయారీదార్లకు పన్నులో మినహాయింపునిచ్చారు. ఈ ఏడాది జూలై నెలలో ఆలస్యంగా జీఎ్సటీఆర్ 3బీ భర్తీ చేసినందుకు ఆలస్యపు ఫీజును మినహాయించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 17, 2017 Author Share Posted October 17, 2017 భోజన ప్రియమైన వూరట! ఏసీ రెస్టారెంట్లపై జీఎస్టీ తగ్గింపు? మంత్రుల బృందం పరిశీలనలో ప్రతిపాదన ఈనాడు, దిల్లీ: ఏసీ రెస్టారెంట్లపై ఇప్పుడున్న 18 శాతం జీఎస్టీ..12 శాతానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాన్-ఏసీ రెస్టారెంట్లపై 12శాతం జీఎస్టీ ఉండగా, ఏసీ సౌకర్యం ఉన్నవాటిని అదే వర్గంలో చేర్చే అవకాశం ఉంది. ఏడు, ఐదు నక్షత్రాల హోదా ఉన్న ఏసీ రెస్టారెంట్లపై మాత్రం యథావిధిగా 18 శాతం పన్ను కొనసాగనుంది. ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని తగ్గించాలన్న విజ్ఞప్తులను అధ్యయనం చేస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. పన్ను రాయితీలు ఇస్తూ 12% జీఎస్టీ విధించాలా? రాయితీలు ఇవ్వకుండా విధించాలా? అన్నదానిపై ఈ నెల 29న జరగనున్న సమావేశంలో చర్చిస్తుందని ఓ అధికారి తెలిపారు. అనంతరం నవంబరు 9న గువాహటిలో జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రవేశపెడుతుందని చెప్పారు. జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెస్టారెంట్లు వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయో, లేవో అన్నదాన్ని కూడా పరిశీలిస్తుంది. ఈ బృందంలో హిమంత బిశ్వశర్మ (అసోం), హసీబ్ డ్రాబు (జమ్ము-కశ్మీర్), మన్ప్రీత్ బాదల్ (పంజాబ్), సుశీల్ మోదీ (బిహార్), అమర్ అగర్వాల్ (ఛత్తీస్గఢ్) సభ్యులుగా ఉన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 20, 2017 Author Share Posted October 20, 2017 Link to comment Share on other sites More sharing options...
vinayak Posted October 20, 2017 Share Posted October 20, 2017 HOMEWORK cheyyakunda prajala meeda rudditey anni fail ye.nobody works hard like our dynamic CBN Link to comment Share on other sites More sharing options...
Yaswanth.M Posted October 21, 2017 Share Posted October 21, 2017 HOMEWORK cheyyakunda prajala meeda rudditey anni fail ye.nobody works hard like our dynamic CBN Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.