Jump to content

‘సమస్యలు పరిష్కరిస్తే టీడీపీలో చేరతాం’


Recommended Posts




పులివెందుల టౌన్‌: బంగారుపేట, నగరి గుట్ట బలిజ కులస్థుల సమస్యలు పరిష్కరి స్తే టీడీపీలో చేరతామని ప్రకటించారు. ఆదివారం మాజీ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ తూగుట్ల మధుసూధన్‌రెడ్డి, టీడీపీ నేత సిద్దారెడ్డి నగరిగుట్ట, బంగారుపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బలిజ కులస్థులు వారి సమస్య లు ఎప్పటి నుంచో తిష్టవేసుకు కూర్చున్నాయని వివరించారు. వాటిని పరిష్కరిస్తే టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామన్నా రు.

 

పక్కాగృహాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఎన్నిమార్లు విన్నవించినా మంజూరు కాలే దన్నారు. తూగుట్ల మధు, సిద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషిచే స్తోందన్నారు. మీ సమస్యలు వెంటనే పరి ష్కరించేందుకు సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. బలిజ కులస్థుల సమస్య లు పరిష్కరించేందుకు చొరవ చూపుతామ న్నా. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకాలని వారిని కోరారు. టీడీపీ పథకాలకు యువత ఆకర్షితులై టీడీపీలే చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బలిజ కులస్థులు రవి, ప్రసాద్‌, రమణ, ఆలమూరి రమణ, బ్రహ్మం, చిన్నబ్రహ్మం, శివ, ము నేంద్ర, మురళి, రామసుబ్బయ్య, ప్రసాద్‌, చిన్న, చిన్నకోట్ల మునెయ్య పాల్గొన్నారు.



 



 


 


 


 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...