Ramesh39 Posted February 1, 2017 Share Posted February 1, 2017 2017-18 వార్షిక బడ్జెట్ - ముఖ్యాంశాలు వార్షికాదాయం రూ.50లక్షలు అంతకన్నా ఎక్కువ ఉంటే 10శాతం సర్ఛార్జి. రూ.3లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు. వ్యక్తిగత ఆదాయపన్ను: 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను.(ప్రస్తుతం 10శాతంగా ఉంది) ఆదాయపన్ను శ్లాబులు యథాతథం రాజకీయ పార్టీల విరాళాలు రూ.20వేలకు మించితే తప్పనిసరిగా లెక్క చూపాలి. నగదు విరాళం రూ.2వేలు మాత్రమే. నల్లధనం నిరోధంలో భాగంగా రూ.3లక్షలకు మించి నగదు లావాదేవీలకు అనుమతి లేదు. పెద్ద నోట్ల రద్దుతో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపులు 35శాతం పెరిగాయి. పీవోఎస్, ఐరిస్ రీడర్, ఆధార్ యంత్రాలకు పన్ను తగ్గింపు. క్యాపిటల్ గెయిన్స్ పరిధి 3ఏళ్ల నుంచి రెండేళ్లకు కుదింపు చిన్న కంపెనీలకు 5శాతం ఆదాయపు పన్ను తగ్గింపు. దీనివల్ల 96శాతం కంపెనీలకు లాభాలు. రూ.5కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలకు ఒకశాతం కార్పొరేట్ పన్నుమినహాయింపు 4.2కోట్ల వేతన జీవుల్లో 1.7 కోట్లమంది మాత్రమే ఐటీ రిటర్న్ దాఖలు చేశారు. మధ్య తరగతికి ఊరట. పన్ను విధానం సరళీకరణ. హేతుబద్ధీకరణ. అమరావతి వాసులకు మూలధన లాభాల పన్ను మినహాయింపు. అమరావతి భూసమీకరణలో సహకరించిన రైతులకు పన్ను మినహాయింపు. బడ్జెట్లో మూడు పెద్ద సంస్కరణలు. 1. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లును పార్లమెంట్ ఆమోదించటం. 2.రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం. 3. ప్రణాళిక, ప్రణాళికేతర విధానం పక్కన బెట్టడం. ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య తక్కువగా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వాస్తవ దృశ్యం బయటకు వచ్చింది. జీడీపీలో పన్నులశాతం తక్కువగా ఉంది. ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.1.74లక్షల కోట్లే వస్తోంది. రక్షణ రంగ కేటాయింపులు రూ.2.74లక్షల కోట్లు. మొత్తం బడ్జెట్ రూ.21లక్షల 47వేల కోట్లు. ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనం. దీనికోసం కొత్తచట్టం. రక్షణశాఖ విశ్రాంత ఉద్యోగులకు వెబ్ ఆధారిత పింఛన్ సేవలు 20లక్షల ఆధార్ ఆధారిత స్వైపింగ్ యంత్రాలు పోస్టాఫీసు ద్వారా పాస్పోర్ట్ అప్లికేషన్ల స్వీకరణ. డిజిటల్ లావాదేవీల రూపకల్పన ఆధారత్తో కూడా చెల్లింపులకు అవకాశం వ్యక్తిగత వినియోగదారులకు, వ్యాపారస్థులకు కొత్తగా మరో రెండు పథకాలు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత. సామాన్యుడికి ఎన్నో లాభాలు. బీమ్ యాప్తో చెల్లింపులు పెరిగాయి. కోటి 25లక్షల మంది బీమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు 250 ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు. ఎలక్ట్రానిక్ ఉత్పాదక కేంద్రాల కోసం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ముద్రా రుణాల కోసం రూ.2లక్షల 44 వేల కోట్లు 20,000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. ఒడిశా, రాజస్థాన్ల్లో చమురు నిల్వల కేంద్రాలు. విదేశీ పెట్టుబడుల కోసం ఎఫ్ఐపీబీ రద్దు. ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు విలువల నిర్థరణ కమిటీ ఏర్పాటు మెట్రోరైలు ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం. రైల్వేలకు రూ.55వేల కోట్ల ప్రభుత్వ సాయం. రైల్వే బడ్జెట్కు రూ.1.31లక్షల కోట్లు కేటాయింపు. గర్భిణి ఆస్పత్రి ఖర్చులకు రూ.6వేల బదలాయింపు. మౌలిక రంగానికి రూ.3,96,135 కోట్లు రహదారులకు రూ.64వేల కోట్లు. మెట్రో రైల్వే విధానం రూపకల్పన. దేశమంతటా భారతమెట్రో సేవలు. హైస్పీడ్ బ్రాండ్ బ్యాండ్ అనుసంధానికి ప్రాధాన్యం. ఇందు కోసం డిజిగవ్ పథకం. దేశమంతా హాట్స్పాట్లు 25 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ. 2020నాటికి కాపాలదారులేకుండా చర్యలు. రైల్వే క్రాసింగుల మూసివేత. 2017-18లో కొత్తగా 3,500కి.మీ. మేర రైళ్ల సర్వీస్ పొడిగింపు. ఐఆర్సీటీసీ టికెట్లపై సర్వీస్ ఛార్జీలు ఎత్తివేత రైల్వేల రవాణా ప్రైవేటురంగం నుంచి పోటీ. పర్యావరణహిత రైల్వే బోగీలు. సౌరశక్తి వినియోగం. పర్యాటక స్థలాల్లో ప్రత్యేక రైళ్లు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు 5వేల రైల్వేస్టేషన్లలో లిఫ్టులు రైల్వేల భద్రతకు ప్రత్యేకనిధి. నాలుగు అంశాలపై దృష్టి. 1.ప్రయాణికుల భద్రత. 2.మూలధనం, 3. శుభ్రత. 4. ఆర్థిక నిర్వహణ 8శాతం గ్యారెంటీతో సీనియర్ సిటిజన్లకు ఎల్ఐసీ కొత్త పథకం ఎస్సీల సంక్షేమానికి 52,393 కోట్లు. ఎస్టీలు, మైనార్టీలకు భారీగా నిధుల కేటాయింపు. పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు. వైద్య పరికరాల ధరల తగ్గింపు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. నిపుణులైన వైద్యుల నియామకం. ఉపాధి అవకాశం ఎక్కువగా ఉన్న కోర్సుల ఏర్పాటు. సంకల్ప్ పథకం ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ. దేశం వెలుపల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ. దేశవ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు. ఐసీటీ ద్వారా విద్యాబోధన. అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ ప్రతిభ కలిగిన కళాశాలల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు. సెకండరీ విద్యలో ఆవిష్కరణలకు ప్రత్యేకనిధి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.48వేల కోట్ల కేటాయింపు. ఫ్లొరైడ్ బాధిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా. గ్రామాల్లో అభివృద్ధి 42 నుంచి 60శాతానికి పెరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 2018కల్లా గ్రామీణ విద్యుద్దీకరణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం. ప్రధాన మంత్రి పజల్ యోజన కింద రోడ్లు, 133 కి.మీ. ప్రతి రోజూ నిర్మించనున్నాం. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉపాధిహామీ పథకంలో మహిళలకు ప్రాతినిథ్యం పెంపు కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార కేంద్రాలు 100 రోజుల కనీస ఉపాధిహామీ. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాలవెల్లువ పథకం కింద రూ.8వేల కోట్లతో పాలసేకరణ కేంద్రాల స్థాపన. రైతులకు రూ.10లక్షల కోట్లను రుణాలుగా ఇవ్వాలన్న లక్ష్యం. సాగునీటి రంగానికి ప్రత్యేకనిధి. పెద్దనోట్ల రద్దుతో రానున్న కాలంలో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. రైతులకు అండగా ఫసల్ బీమా యోజనను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం. రైతుల సంక్షేమ, గ్రామీణ ఉపాధి, యువత, మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ సుపరిపాలన, విత్త విధానం, పన్ను సంస్కరణలు, నిజాయితీ పనులకు పెద్దపీట. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపివేశాం. రైల్వేల స్వతంత్ర ప్రతిపత్తి కొనసాగుతుంది. ఫిబ్రవరి 1కి బడ్జెట్ను ముందుకు జరిపాం. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయి. దీంతో మరికొందరికి రుణాలిచ్చే సౌకర్యం కలుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతాయి నోట్లరద్దు ఫలితాలు కనిపిస్తున్నాయి. పన్ను ఎగవేతదారులు పట్టుబడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనానికి కళ్లెం పడింది. దొంగ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి చేయూతనిచ్చాయి. పన్ను ఎగవేతల్లో నల్లధనం పేరుకుంది. నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారింది. పెద్దనోట్ల రద్దు సాహసోపేతమనైన చర్య. రెండోవది పెద్దనోట్ల రద్దుపై చర్యలో ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్టీ ఒకటి. తయారీ రంగంలో ఆరో స్థానానికి చేరుకున్నాం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా ఐఎంఎఫ్ పేర్కొంది విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. 361 బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్య నిల్వలు చేరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. అయినా భారత్ అన్నిరంగాల్లో ప్రగతి సాధించింది. ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులో ఉంది. అనేక ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నల్లధనంపై పోరు సాగిస్తున్నాం. బంధుప్రీతి, అవినీతికి దూరంగా పారదర్శకమైన పాలనకు కట్టుబడి ఉన్నాం. ప్రజలు ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నారు. బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted February 1, 2017 Author Share Posted February 1, 2017 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా ఐఎంఎఫ్ పేర్కొంది. * విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. 361 బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్య నిల్వలు చేరాయి. * రైతులకు అండగా ఫసల్ బీమా యోజనను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం. * పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాలవెల్లువ పథకం కింద రూ.8వేల కోట్లతో పాలసేకరణ కేంద్రాల స్థాపన. * గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. * గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్టీ ఒకటి. * ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. అయినా భారత్ అన్నిరంగాల్లో ప్రగతి సాధించింది. * వ్యవసాయ రుణాలకు రూ. 10లక్షల కోట్లు కేటాయింపు * ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్లో వ్యవసాయ రంగానికి 60 రోజుల వడ్డీ మినహాయింపు * నాబార్డుతో సహకార బ్యాంకులు, వ్యవసాయ సంఘాలను అనుసంధానిస్తాం * ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలోనూ భూసార పరీక్ష కేంద్రాల ఏర్పాటు * సాగునీటి సౌకర్యం కోసం రూ.40వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు * ఈనామ్లు రూ.240 నుంచి రూ.500 పెంపు * రైతులు, గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి * నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో అతి గొప్ప మార్పునకు పునాది పడింది. * ముడి చమురు ధరల్లో ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టాయి. * దేశ జీడీపీ 2017-18లో 7.6 శాతం, 2018-19లో 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. * మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన దిశగా బడ్జెట్ రూపొందించాం. * ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల విధానాలు సరళీకరిస్తున్నాం. * ఈ బడ్జెట్ ద్వారా మూడు సంస్కరణలు తీసుకొచ్చాం. బడ్జెట్ను ఫిబ్రవరికి మార్చాం. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపాం. * ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంలా కాకుండా రంగాల వారీగా బడ్జెట్ రూపొందించాం. * రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తాం. * 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. * ఈ ప్రభుత్వం సంపూర్ణ పారదర్శక విధానాలను అమలు చేస్తోంది. * విదేశీ మారక ద్రవ్యనిల్వలు 361 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. * భారత్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. * ద్రవ్యోల్బణాన్ని రెండంకెల నుంచి కనిష్ఠస్థాయికి తగ్గించాం. * నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశాం. నల్లధనంపై యుద్ధం ప్రకటించాం. అవినీతిని నిర్మూలిస్తాం. Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted February 1, 2017 Author Share Posted February 1, 2017 ఏపీ రాజధాని రైతులకు కేంద్రం వరం దిల్లీ: నవ్యాంధ్ర రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వరమిచ్చింది. అమరావతి వాసులకు మూలధన పన్ను లాభాల నుంచి మినహాయింపు ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ వరాన్ని ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించినట్లయింది. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 1, 2017 Share Posted February 1, 2017 ఏపీ రాజధాని రైతులకు కేంద్రం వరం దిల్లీ: నవ్యాంధ్ర రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వరమిచ్చింది. అమరావతి వాసులకు మూలధన పన్ను లాభాల నుంచి మినహాయింపు ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ వరాన్ని ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించినట్లయింది. super, Link to comment Share on other sites More sharing options...
nbk@myHeart Posted February 1, 2017 Share Posted February 1, 2017 ఏపీ రాజధాని రైతులకు కేంద్రం వరం దిల్లీ: నవ్యాంధ్ర రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వరమిచ్చింది. అమరావతి వాసులకు మూలధన పన్ను లాభాల నుంచి మినహాయింపు ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ వరాన్ని ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించినట్లయింది. Vivarimpudi Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted February 1, 2017 Share Posted February 1, 2017 Vivarimpudi no tax on selling Link to comment Share on other sites More sharing options...
nbk@myHeart Posted February 1, 2017 Share Posted February 1, 2017 no tax on selling Oh.k Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 1, 2017 Share Posted February 1, 2017 3 lakhs paina emanna pay cheyyali ante cash tho cheyyakudada? Link to comment Share on other sites More sharing options...
saileshgogineni Posted February 1, 2017 Share Posted February 1, 2017 3 lakhs paina emanna pay cheyyali ante cash tho cheyyakudada?no every thing must be trabsperant Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 1, 2017 Share Posted February 1, 2017 2.5 lakhs -5lakhs 5% tax annaru 3lakks varuku no tax annaru deeni meaning? Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted February 1, 2017 Share Posted February 1, 2017 2.5 lakhs -5lakhs 5% tax annaru 3lakks varuku no tax annaru deeni meaning? eenadu gaadi first lo wrong vesi next correct chesaadu no slabs change 2.5 to 5 lakhs income vunnallaki 5% 5+ vallaki 12,500 rebate 50+ vallaki 10% extra 1c + vallaki 15% extra Link to comment Share on other sites More sharing options...
bezawada369 Posted February 1, 2017 Share Posted February 1, 2017 Comedy budget.. bjp has failed big time Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.