Jump to content

Hamsaladeevi


sonykongara

Recommended Posts

పర్యాటక కేంద్రంగా హంసలదీవి: సీఎం
 
636071752349206349.jpg
కోడూరు, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీరం గొప్పవరమని, రాష్ట్ర అభివృద్ధికి తీర ప్రాంతమే కీలకమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి వద్ద కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశంలో గురువారం సీఎం ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. కృష్ణవేణి విగ్రహానికి, కృష్ణమ్మ పాదాలకు పూలమాలలు వేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. పవిత్రమైన హంసలదీవిని బ్రహ్మాండమైన టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. సాగరసంగమానికి రోడ్డు వేసేందుకు నిధులు మంజూరుచేస్తే అడ్డుకున్నారని, అయినా వదిలిపెట్టబోమని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హంసలదీవిని అభివృద్ధి చేస్తామని హామీఇచ్చారు. ఉల్లిపాలెం-భవానీపురం బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బందరు ప్రయాణం దగ్గరవుతుందన్నారు. మచిలీపట్నం పోర్టు వస్తే ఈ ప్రాంతాన్ని ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. సముద్రం వెంబడి చక్కటి రోడ్డు వేస్తే పరిశ్రమలు రావటంతోపాటు టూరిజం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అప్పుడు హంసలదీవి దశ మారుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణాడెల్టాను సాగు, తాగునీటి సమస్య రాకుండా చూసే బాధ్యత తన ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గోదావరి నది జీవనది అయితే, కృష్ణానది ప్రాణనాడి అని, ఈ రెండింటి అనుసంధానంతో కరువు సమస్య రాదన్నారు. విద్యార్థినుల కోలాటాన్ని తిలకించిన చంద్రబాబు వారిని అభినందించారు. పుష్కర యాత్రికులతో మాట్లాడారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...