Jump to content

ఆస్తులు.. అప్పులు.. తేలిపోతాయా?!


Recommended Posts

ఆస్తులు.. అప్పులు.. తేలిపోతాయా?!
 
636015812795773913.jpg
  • 21న తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోం శాఖ భేటీ
హైదరాబాద్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణల మధ్య నలుగుతున్న పదో షెడ్యూల్‌ పరిధిలోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ తేలిపోనుందా? ఈ వివాదం తుది అంకానికి చేరిందా? కేంద్రం ఓ పరిష్కారమార్గాన్ని చూపనుందా? ఈ ప్రశ్నలకు ఏపీ అధికార వర్గం అవుననే సమాధానం చెబుతోంది. ఈ నెల 21న కేంద్ర హోం శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతోనూ పదో షెడ్యూల్‌ పరిధిలోని సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై చర్చించనుంది. పదో షెడ్యూల్‌ పరిధిలోని ఆస్తులు, అప్పులకు సంబంధించి ఏపీ ఉన్నత విద్యా మండలి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఆస్తులు, అప్పులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీం తీర్పు చెప్పింది. దీనిపై ఇప్పటి వరకు కదలికరాలేదు. ఈ నేపథ్యంలో పదో షెడ్యూల్‌ సంస్థల ఆస్తులు, అప్పుల వ్యవహారంలో కేంద్ర హోం శాఖ ఈ నెల 21న కీలక సమావేశం నిర్వహించనుండడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఇదే రోజున ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కృష్ణా నది జలాల పంపిణీ, బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణ చర్చించనున్నాయి.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...