sonykongara Posted March 18, 2016 Share Posted March 18, 2016 భూమి కేటాయింపునకు ప్రభుత్వంతో చర్చలు హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : బెంగళూరుకు చెందిన ‘వీరా వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్’ (వివియుపిఎల్) కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వంద ఎకరాల్లో వాహనాల సమగ్ర ఉత్పత్తికి దోహదం చేసేలా ఈ కొత్త ప్లాంట్ నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకోసం రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్పి మోహన్ కుమార్ చెప్పారు. అందుబాటు ధరల్లో భూమి సమకూరిస్తే ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇందుకోసం త్వరలోనే రెండు రాష్ట్రాల సిఎంలను కలవబోతున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా నేరుగా 5,000 మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. కాగా ఇప్పటి వరకు కోచ్ బస్సుల తయారీలో ఉన్న వీరా ఇపుడు కొత్తగా టర్మాక్ కోచ్ బస్సుల తయారీకి సిద్ధమైంది. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల్ని విమానాల వరకు తీసుకెళ్లేందుకు ఈ బస్సుల్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మన దేశం వీటిని పూర్తిగా దిగుమతి చేసుకుంటోంది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.