sonykongara Posted November 5, 2015 Share Posted November 5, 2015 ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం పోర్టులో ఏపీ జెన్కో స్థాపించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ప్లాంటును ఈ నెల 30న జాతికి అంకితం చేయనున్నారు. ఒకొక్కటి 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం గల రెండు యూనిట్లను ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ను ఆహ్వానించింది. ఆందుకు ఆయన సమ్మతించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ థర్మల్ విద్యుత్కేంద్రం ట్రయల్ రన్ ఇప్పటికే ముగిసింది. తొలుత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిదిద్దారు. దీంతో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 5, 2015 Author Share Posted November 5, 2015 హైదరాబాద్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సరఫరా, పంపిణీ, ఉత్పత్తి, విద్యుదుత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయించడం వంటి అంశాల్లో ఏపీ జెన్కో, ట్రాన్స్కోలకు ఎనర్జీ ఎనార్షియా సంస్థ ప్రతిభా అవార్డులను ప్రకటించింది. విద్యుత్తు ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీ జెన్కో విశేష ప్రతిభ కనబరుస్తోందని ఈ సంస్థ పేర్కొంది. అవార్డులను ఢిల్లీలో ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్ అందుకుంటారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.