Jump to content

Thutheri


Recommended Posts

'వైఎస్‌ఆర్‌ జనభేరి' పేరిట ఎన్నికల ప్రచారం తిరుపతి నుంచి ప్రారంబించిన వై యస్ జగన్ శనివారం రాత్రికి తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.. జగన్ శ్రీవారిని దర్శించుకున్న సందర్భంలో సంప్రదాయ పట్టువస్త్రాలు ధరించారు. పట్టుపంచె, లేత తెలుపు, చారల చొక్కా ధరించి మెడలో పట్టు ఉత్తరీయం వేసుకున్నారు. సంప్రదాయ వస్త్రాలతో దర్శనానికి జగన్వెళ్ళి స్వామివారిని దర్శించుకుని సాష్టంగా నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో గుడిలోనే ఎక్కువ సమయం గడిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి పాదాల వద్ద ఉన్న తులసి, ప్రసాదాలను జగన్‌కు అందజేశారు. 

జగన్‌ శ్రీవారి ఆలయంలోకి చెప్పులు వేసుకెళ్లారని కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన గుడి ప్రాంగణంలోకి చేరుకోకముందే పాదరక్షలు విడిచారు. ప్రాంగణం వెలుపల తీసిన ఫోటోలనే గుడి ప్రాంగణంలో తీసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినంతకాలం వైఎస్ రాజశేఖరరెడ్డి క్రమం తప్పకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తి విశ్వాసాలతో ఆయన వచ్చినన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి కూడా తిరుమలకు రాలేదు. చిన్నతనం నుంచి తండ్రితోపాటు వైఎస్ జగన్‌ అనేకమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు.

 

 

 

1926881_692097997496166_494692260_n.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...