Jump to content

sonykongara

Members
  • Posts

    69,071
  • Joined

  • Last visited

  • Days Won

    94

Posts posted by sonykongara

  1. AP News: వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

    ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

    Updated : 31 Aug 2024 16:37 IST
     
     
     
     
     
     

    310824gates-inner.webp

    విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పైవంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు. 

  2. జత్వాని కేసులో భారీ సంచలన వార్త స్పష్టమైన ఆధారాలతో దొరికిపోయిన నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ముంబై నటి జత్వాని వ్యవహారంలో వెలుగులోకి అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర జత్వానిని ఐదు రోజులపాటు కంట్రోల్ రూమ్‍లో అక్రమంగా బంధించి విచారించిన పోలీసులు* అప్పటి డీజీపీ ఆదేశాలతో జత్వానిని విచారించిన ఏసీపీ హనుమంతరావుతో పాటు మరో ఇద్దరు లాయర్లు

  3. On 7/23/2024 at 4:40 PM, sonykongara said:

    image.png.202145a70f94f8c97c77b3970d08fe0e.png

    Piyush Kumar: రాజధాని నిధుల భారం రాష్ట్రంపై పడదు

    ‘రాజధాని అమరావతికి కేంద్రం సాకి (మూలధన వ్యయంగా ఇచ్చే నిధులు) కింద ఇస్తున్న నిధుల భారం రాష్ట్రంపై పడబోదు. 50 ఏళ్ల తర్వాత తీర్చే రుణమే ఇది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులు ఇస్తోంది.

    Published : 31 Aug 2024 05:38 IST
     
     
     
     
     
     

    ప్రత్యేక ప్యాకేజీలోనే ఆ నిధులు
    రాష్ట్ర వాటా 10 శాతమూ కేంద్రమే భరిస్తుంది
    పోలవరానికి రూ.12,157 కోట్లు అడ్వాన్సుగా ఇస్తారు
    తొలుత వర్క్సు పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం
    ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌
    ఈనాడు - అమరావతి

    ap300824main5a.jpg

    ‘రాజధాని అమరావతికి కేంద్రం సాకి (మూలధన వ్యయంగా ఇచ్చే నిధులు) కింద ఇస్తున్న నిధుల భారం రాష్ట్రంపై పడబోదు. 50 ఏళ్ల తర్వాత తీర్చే రుణమే ఇది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులు ఇస్తోంది. కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరించే విధానంలో ఇవి వస్తున్నాయి. రాష్ట్రం భరించాల్సిన 10 శాతం నిధులూ కేంద్రమే వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తోంది’ అని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ చెప్పారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000 కోట్ల నిధులు ఇలా రాష్ట్రానికి రానున్నాయి. పోలవరానికి ఇవ్వబోయే రూ. 12,157 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ఏడాది రూ. 6,000 కోట్లు అడ్వాన్సుగా వస్తాయి. గతంలో పోలవరం ప్రాజెక్టులో పని చేసి తొలుత రాష్ట్రం ఆ బిల్లులు చెల్లిస్తే ఆనక కేంద్రం రీయింబర్సు (తిరిగి చెల్లింపు) చేసేది. ఇప్పుడు అడ్వాన్సుగా ఆ నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది’ అని ఆయన వివరించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం పీయూష్‌ కుమార్‌ కొద్దిమంది విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏం చేయబోతున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలివి.. 

    ప్రస్తుతం కేంద్రం మూలధన వ్యయం కింద ఇస్తున్న నిధులతో పనులు ప్రారంభిస్తాం. సాకీ కింద మరిన్ని నిధులు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అభివృద్ధి పనులకు వెచ్చిస్తూ ఆదాయం సృష్టిస్తాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఇతర మార్గాలూ అన్వేషించాం. వాటన్నింటికీ ఇప్పుడు వెల్లడించలేం. ఒకవైపు రాబడి పెంచుతూ మరోవైపు అనవసర ఖర్చులు తగ్గించనున్నాం. ఎక్కడా వృథా వ్యయం చేయబోం. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషవలయంలా మారిపోయింది. అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తూ పరిస్థితులను చక్కదిద్దుతాం. 

    • రాష్ట్రంలో పెండింగ్‌ బిల్లులు రూ. 1.30 లక్షల కోట్లు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, వేస్‌ అండ్‌ మీన్స్, సొంత రాబడి కలిపి తొలుత వర్క్సు పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లిస్తాం. రెవెన్యూ పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు మరికొంత సమయం పడుతుంది. మధ్యమధ్యలో సర్దుబాటు చేసుకుంటూ అవీ చెల్లిస్తాం. అన్ని బిల్లులకు వచ్చే ఏడాది వరకు సమయం పట్టవచ్చు. 
    • కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. కేంద్ర పథకాలను రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి పనులకు అనుసంధానం చేయవచ్చో పరిశీలిస్తున్నాం.  
    • రాష్ట్రంలో విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులు ఎన్నో ఉన్నా వాటికి రుణం తీసుకునే విషయం ఆలోచిస్తున్నాం. వడ్డీ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. పైగా డాలర్‌ మారకం ప్రభావమూ పడుతోంది. దేశీయంగా తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం ఉంటే ఆ విదేశీ రుణాలకు ఎక్కువ వడ్డీకి తీసుకోవడం ఎందుకు? గతంలో యూనివర్సిటీలు, వివిధ బోర్డులు, ఇతరత్రా సంస్థల నుంచి డిపాజిట్లను రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసు కార్పొరేషన్‌ సమీకరించింది. ఆ నిధులను తిరిగి ఆ సంస్థలకు చెల్లించడం తక్షణమే సాధ్యం కాదు. 2033 వరకు ఆ నిధులను వాడుకుంటూ వడ్డీ చెల్లించేలా ఆ సంస్థ సమీకరించింది. ఆ మొత్తాలు వెనక్కు ఇవ్వడం సులభమయ్యే పని కాదు. 
    • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా బహిరంగ మార్కెట్‌ రుణం రూ. 56,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అవి కాక విద్యుత్తు సంస్కరణలు అమలు చేసినందున కేంద్రం మరో 0.5 శాతం రుణం ఇవ్వబోతోంది. ఆ రూపేణా మరో రూ. 8,000 కోట్లు త్వరలో రానున్నాయి. ఆర్థికశాఖలో సంస్కరణలు చేపడతాం. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తాం. ఆర్థికశాఖ సిబ్బందితో పాటు కన్సల్టెన్సీల సేవలూ అవసరమే. 
    • కార్పొరేషన్ల రుణాలను ప్రభుత్వం ఉపయోగించుకోదు. ఆయా కార్పొరేషన్లు వాటికి అవసరమైతే రుణాలు తీసుకుంటాయి. అవి ఖర్చు చేసుకుంటాయి. గతంలో తప్పిదాలను మేం చేయబోము. రుణాలు తీసుకువచ్చి పథకాలకు ఇవ్వబోం.image.jpeg.0808d07fb191012fbf6a6538dad0abbd.jpeg
  4. Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?

    ABN , Publish Date - Aug 31 , 2024 | 10:00 AM

     

    గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమేంటి? ఈ మొత్తం వ్యవహారం ఉన్న కోణాలేంటి..? ఇందులో సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? ఇంత జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

     
     
    Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?
     

     

    • గుడ్లవల్లేరు కాలేజీలోని బాలిక వసతి గృహాల్లో కెమెరాలు పెట్టిందెవరు?

       

       

       

    • ఆ ప్రేమికులను ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేశారా?

    • మరో ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా?

    • యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది?

    • ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదెందుకు?

    • విద్యార్థినుల ఆందోళనతో కాలేజీలో ఉద్రిక్తత

    • ఆందోళన చేసిన వందలమంది విద్యార్థినులు

    • మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ హామీతో విరమణ

    • విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

     

    గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల (Gudlavalleru Engineering College) బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు (Hidden Camera) ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమేంటి? ప్రేమికుల (Lovers) మధ్య ఉన్న ఆంతరంగిన వ్యవహారాలే దీనంతటికీ కారణమా? ఈ వ్యవహారాన్నే ఆధారంగా చేసుకుని ఒక గ్రూపునకు చెందిన విద్యార్థులు సదరు ప్రేమికులను బ్లాక్‌మెయిల్‌ చేశారా? లేక మరేమైనా ప్రేమకోణం దాగి ఉందా? ఇంతా జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

     

    ABN ఛానల్ ఫాలో అవ్వండి
     
     
     
     
     
     
     
     
     
     

     

     
    gudla-valleru-college-2.jpg

     

    ఎన్టీఆర్ కృష్ణా జిల్లా/గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాల ఏర్పాటు వివాదం వందలమంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసింది. ఇంత జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఒక విద్యార్థినికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగానే యాజమాన్యానికి బెదిరింపులు ఎదురయ్యాయా అనే కోణం వెలుగుచూసింది. ఈ అంశంపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి విచారణకు ఆదేశించడంతో మరింత సంచలనంగా మారింది.

     

     
     

    gudla-valleru-college-4.jpg

    ప్రేమ వ్యవహారాలే కారణమా..?

    కళాశాలలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారాలే ఈ హిడెన్‌ కెమెరాల ఏర్పాటుకు కారణమని తెలుస్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమికులిద్దరూ ప్రకాశం జిల్లాకు చెందినవారు. వీరి మధ్య పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ విషయం బయటకు రాకుండా కొందరు కావాలనే ఇలా చేయించారని చెబుతుండగా, తెరవెనుక మరో కథ కూడా నడిచిందని తెలుస్తోంది. సదరు ప్రేమికుడికి అదే కళాశాలకు చెందిన ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరూ సరదాగా ఉండేవారు. ఒకరిళ్లకు ఒకరు వెళ్లేవారు. కొంతకాలానికి స్నేహితుడి చెల్లెలిని ప్రేమికుడు ప్రేమలోకి దించాడు. ఈ వ్యవహారం స్నేహితుడికి తెలిసి ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చాయి. మాటామాటా పెరిగి ‘నీ ప్రియురాలికి నువ్వు చేసిన వీడియో కాల్స్‌ స్క్రీన్‌ షాట్స్‌ నా దగ్గర ఉన్నాయి. వాటిని బయటపెడతాను’ అని స్నేహితుడు బెదిరించాడు. ఇందుకు నిందితుడు కూడా.. ‘నీ చెల్లితో నేను చేసిన చాటింగ్‌ స్క్రీన్‌షాట్లు బయటపెడతాను.’ అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. కాగా, నిందితురాలిని మరో స్నేహితుడు వన్‌సైడ్‌ లవ్‌ చేస్తుండగా, అతని ద్వారా ఈ హిడెన్‌ కెమెరాల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. సదరు నిందితురాలు ఈ వీడియోలను బయటకు పంపుతోందనే ఆరోపణలతో విద్యార్థినులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏబీవీపీ, మహిళా మోర్చా నాయకులు కూడా కళాశాలకు చేరుకోవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది.

     

     

    gudla-valleru-college.jpg

    సంఘటనాస్థలానికి కలెక్టర్‌, ఎస్పీ

    ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు శుక్రవారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలకు వెళ్లారు. వివరాలు సేకరించారు. కాగా, వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారనే విషయాన్ని వారం క్రితమే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ చేయాలంటే నెల సమయం పడుతుందన్నారని విద్యార్థినులు మండిపడ్డారు. పైగా ఫిర్యాదు చేసిన తమపైనే కేసు పెడతామని బెదిరించారని అధికారులు, మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఘటనపై విచారణ చేసి విద్యార్థినులకు న్యాయం చేస్తామని, వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాల ఆచూకీ కనుగొనేందుకు ఎస్‌ఎస్‌జేడీ పరికరంతో పరిశీలించడానికి ప్రత్యేకబృందాన్ని నియమించామన్నారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని విద్యార్థినులు డిమాండ్‌ చేయగా, అనుమానితులను ఇక్కడకు తీసుకొస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, పూర్తిస్థాయి విచారణచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

     

    ఎంతటి వారినైనా వదిలిపెట్టం..

    ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని, ఈ సంఘటనకు పాల్పడినవారు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని విద్యార్థినులకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌, యార్లగడ్డ వెంక ట్రావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా మాట్లాడుతూ తన మేనకోడలు కూడా అక్కడే చదువుతోందని, తాను కూడా బాధిత కుటుంబానికి చెందినవాడినేనన్నారు. కాగా, ఆందోళన చేస్తున్న తమపై పరీక్షలు, మార్కుల పేరిట యాజమాన్యం వేధించే అవకాశం ఉందని విద్యార్థినులు ఆందోళన చెందగా, అలాంటిదేమీ ఉండదంటూ యాజమాన్యం ద్వారా అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇప్పించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ వార్డెన్‌ను సస్పెండ్‌ చేస్తామని కళాశాల ప్రతినిధులు ప్రకటించారు.

     

     
     

    SP.jpg

    ఆందోళన విరమణ..

    వీడియోలు బయటకు రానివ్వబోమని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. మంగళవారంలోగా విచారణను పూర్తిచేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. వసతి గృహంలో విద్యార్థినులకు రక్షణగా మహిళా పోలీసులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆందోళన విరమించిన విద్యార్థినులు.. విచారణ పూర్తయ్యే వరకు తరగతులకు హాజరుకాబోమని చెప్పారు.

     

    విచారణలో వాస్తవాలు తెలుస్తాయి

    హాస్టల్‌లోని వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఉన్నాయని కళాశాల యాజమాన్యం నమ్మడం లేదు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయి. తప్పుచేసిన వారికి చట్టప్రకారం శిక్ష పడుతుంది. విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తాం. వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఉన్నాయనే విషయం విద్యార్థినుల ఆందోళనతోనే మా దృష్టికి వచ్చింది. – వల్లూరుపల్లి సత్యనారాయణరావు, కళాశాల సెక్రటరీ

×
×
  • Create New...