Jump to content

పీఆర్పీ ప్రధాన కార్యదర్శిగా అరవింద్


Mahesh Tummala

Recommended Posts

ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శిగా అల్లు అరవింద్‌ను నియమించినట్లు పార్టీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ ఓటమి పాలయిన తరువాత పార్టీ కమిటీలన్నింటినీ చిరంజీవి రద్దు చేశారు. ఆ తరువాత వాటిని నియమించినప్పుడు అరవింద్‌కు ఏ పదవీ లభించలేదు. ఇటీవల అరవింద్‌పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి.

 

ఆ సందర్భంగా తాను ఆగస్టులో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నందునే తన మీద ఆరోపణలు చేస్తున్నారని అరవింద్ తన ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం గమనార్హం. కాగా.. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేదవ్యాస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, నల్గొండ జిల్లాకు చెందిన ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమేశ్ నాయక్ పార్టీ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారని తెలిపింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...