Jump to content

చేతితో రాస్తే చిత్తు కాగితమే


Mahesh Tummala

Recommended Posts

కరెంట్ లేదనో... ప్రింటర్ పనిచేయడం లేదనో... కంప్యూటర్ సహకరించడం లేదనో సర్టిఫికెట్లను చేతితో రాసి, జారీ చేస్తే ఇకపై అట్టి సర్టిఫికెట్లు చిత్తుకాగితాల కిందే లెక్క. జిల్లాలో ఇట్టి సర్టిఫికెట్లు ఇక చెల్లుబాటుకావు. సర్టిఫికెట్ల జారీ విధానం అంతా ఆన్‌లైన్‌లో ఉండటంతో ఆఫ్‌లైన్ సర్టిఫికెట్లను నిలుపుదల చేయాలని నిర్దేశించారు. ఈమేరకు తహసీల్దార్లకు కలెక్టర్ ఎన్.గుల్జార్ స్పష్టమైన ఆదేశాస్తూ సర్కులర్ జారీ చేశారు.

 

ఆదాయ, కుల, స్థానిక, కుటుంబ «ద్రువీకరణ పత్రాల జారీకి జిల్లా కలెక్టర్ ఎన్.గుల్జార్ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ ను రూపొందించి, అమల్లో పెట్టారు. దాంతో సర్టిఫికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే జారీచేస్తున్నారు.

 

స్థానిక «ద్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే సమయంలో 'ఇట్టి సర్టిఫికెట్లు ఉన్నత విద్యకు, ఉపాధికి మాత్రమే' చెల్లుబాటు అవుతాయని సర్టిఫికెట్లపై ఉండటంతో, పాస్‌పోర్ట్‌కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాస్ట్‌పోర్ట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే స్థానిక «ద్రువీకరణ పత్రం తప్పనిసరి కావడం... తహసీల్దార్ కార్యాలయాల నుంచి తీసుకునే సర్టిఫికెట్లపై విద్య, ఉపాధి తప్ప మరేతర అవసరాలకు సర్టిఫికెట్ పనికి రాదని తేల్చిచెప్పడంతో పాస్ట్‌పోర్ట్ కార్యాలయం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కొన్ని మండలాల్లో తహసీల్దార్లు చేతితో పాస్‌పోర్ట్ కోసం కూడా దీన్ని వాడుకోవచ్చని రాయడంతో కలెక్టర్‌స్పందించారు. నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని కానీ, ఇవ్వకూడదని కానీ నిబంధన లేదు. దాంతో దీనిపై స్పష్టత లేదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...