KING007 Posted September 28, 2021 Posted September 28, 2021 దిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు పార్లమెంట్, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేలు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్, బద్వేలులో అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.. ముఖ్యమైన తేదీలివే.. ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 1 నామినేషన్ల స్వీకరణ గడువు: అక్టోబర్ 8 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 11 నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 13 ఎన్నికల పోలింగ్: అక్టోబర్ 30 ఓట్ల లెక్కింపు: నవంబర్ 2
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.