Munna_NTR Posted December 7, 2018 Share Posted December 7, 2018 తెలంగాణ ఎన్నికల్లో మధ్యాహ్నానికి పోలింగ్ 50 శాతానికి చేరింది.. అంటే పోలింగ్ ముగిసే సమయానికి ఇంకా పెరుగుతుంది.. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపుతున్నట్లే…!? అంటే లగడపాటి చెప్పిన దాని మేరకు చూస్తే.. కేసీఆర్ ఓటమి ఫిక్స్ అయినట్లే…!? లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. పోలింగ్ పెరిగితే కూటమికి అనుకూలంగా ఉంటుందని, టీఆర్ఎస్పై వ్యతిరేకత ఈ రూపంలో బైట పడుతుందని లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో ఎన్నికల సర్వే గురించిన ఫలితాలు విడుదల చేసే సమయంలోనే జోస్యం చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం పైపైకి వెళ్తోంది. పోలింగ్ ప్రారంభం అయిన తర్వాత ముందు కొస్త మందకొడిగా కనిపించినా ఆ తర్వాత క్రమంగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయానికి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, అదిలాబాద్ ప్రాంతాల్లో 50 శాతానికి మించి పోలింగ్ నమోదు కాగా ఇతర ప్రాంతాల్లో నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. మొత్తంగా తెలంగాణలో విడుదలైన పలు సర్వేల ఫలితాలను బట్టి చూస్తే.. పోలింగ్ శాతం పెరిగితే కూటమికి అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నట్లుగా ఉన్నాయని టాక్ వినబడుతోంది. 2014 ఎన్నికలను తీసుకుంటే మొత్తం 68.5 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి అంతకు మించి ఓటింగ్జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంఛనాలు వేసింది. గతంలో కన్నా మించి పెరిగితే మహాకూటమి గెలుపు పక్కా అని లగడపాటి చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణలో మహా కూటమికి గెలుపు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తులో పనిచేసేంది కాబట్టే ఓటింగ్ పెరిగి కూటమికి కలిసొచ్చేలా ఉందని తెలుస్తోంది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.