sonykongara Posted July 19, 2018 Share Posted July 19, 2018 నూతన నౌకాశ్రయంపై కేంద్ర కమిటీ ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో నూతన నౌకాశ్రయం ఎక్కడ నిర్మించాలో ఖరారు చేయడానికి కేంద్రం ముగ్గురు నిపుణులతో కమిటీ వేసింది. తొలుత నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో నౌకాశ్రయం నిర్మించాలని భావించిన సంగతి తెలిసిందే. దానిపై అధ్యయనం చేసిన నీతిఆయోగ్ అధికారులు ఆ పోర్టు లాభదాయకం కాదని తేల్చేశారు. దుగరాజపట్నానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టు, 80 కిలోమీటర్ల దూరంలోనే ఎన్నోర్, జేఎన్పీటీ పోర్టులు ఉన్నాయని, అవి సగటున 65 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కొత్త పోర్టు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నౌకాశ్రయం నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ నెల 10న ఉత్తర్వులిచ్చింది. రాజీవ ఆర్ సిన్హా నేతృత్వంలోని కమిటీ ఆరు నెలలు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇస్తుంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 19, 2018 Author Share Posted July 19, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.