sonykongara Posted June 21, 2018 Share Posted June 21, 2018 జగన్ పేరు ఇప్పుడు జగన్ మోదీ రెడ్డి లోకేశ్ చిత్తూరు: హేతుబద్ధత లేకుండా చేసిన విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోకుండా నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఇదిగో.. అదిగో అంటూ నమ్మకద్రోహం చేసిందని ఏపీ పురపాలక, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తాత్సారం చేస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ గురించి వైకాపా అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక్క మాటా మాట్లాడటం లేదని మండిపడ్డారు. మోదీపై ఆరోపణలు చేస్తే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నారని ఆరోపించారు. గురువారం లోకేశ్ చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం తుమ్మిశిలో పర్యటించారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ పేరు మారిందని, ఇప్పుడాయన జగన్ మోదీ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు చేసినా 2019లో 25 పార్లమెంట్ సీట్లు గెలిచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు కృషివల్లే కియా లాంటి పరిశ్రమలు, ఐటీ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్ వంటి సంస్థలు వచ్చాయన్నారు. త్వరలోనే రిలయన్స్ కూడా రాష్ట్రానికి రాబోతోందన్నారు. తుమ్మిశి పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. నిరుదో్యోగ యువతకు త్వరలోనే రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని లోకేశ్ తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.