Jump to content

నటించాడు అనేకంటే జీవించాడు అంటేనే న్యాయం చేసినట్లు


Govindu

Recommended Posts

జై లవకుశ.. సినిమాను చూసిన ప్రేక్షకుల రెస్పాన్స్

భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘జై లవకుశ’ సినిమా అభిమానులు, సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. మొట్టమొదటిసారి తన అన్న కల్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మూడు పాత్రల్లో నటిస్తుండగా, రాశిఖన్నా, నివేథా థామస్ హీరోయిన్లుగా ఆడిపాడనున్నారు. సాయి కుమార్, పోసాని కృష్ణమురళి, హంసానందిని, బ్రహ్మాజీ, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. టీజర్లు, ట్రైలర్, పాటలు అన్నింటికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన జై లవకుశ.. ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగానే థియేటర్లలో సందడిచేసింది. అమెరికాలో యూఎస్ తెలుగు మూవీ ఎల్‌ఎల్‌సీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. ఈ సినిమా ప్రీమియర్ షోలను చూసిన ఎన్నారైలు ‘జై లవకుశ’ ఎలా ఉందో తేల్చేశారు. 

జై లవకుశ.. మొత్తంగా అన్నదమ్ముల సినిమా. తండ్రిగా పోసాని కృష్ణమురళి నటించాడు. కథ మొత్తంగా చూస్తే రొటీన్ రివేంజ్ డ్రామానేననీ కాకపోతే ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను తీర్చిదిద్దారని ఓ ఎన్నారై అభిప్రాయపడ్డాడు. ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా, సినీ ప్రేక్షకులకు కూడా ‘జై లవకుశ’ దసరా పండుగకు గ్రాండ్ ట్రీట్‌గా ఉంటుందని మరో ప్రవాసీ పేర్కొన్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా లవ, కుశకు సంబంధించిన సీన్స్‌తో సరదాగా సాగిపోతుందనీ, కుశ క్యారెక్టర్ అద్భుతమైన కామెడీని పండిస్తుందని చెబుతున్నారు. బ్యాంకులో సాగే కామెడీ సన్నివేశాలు కూడా అలరిస్తాయట. ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయిందనీ, జై క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్‌తో థియేటర్లు ఈలలతో హోరెత్తిపోతాయని చెబుతున్నారు. ‘జై’ పాత్రతో ఎన్టీఆర్ నటుడిగా తానేంటో మరోసారి నిరూపించుకున్నారంటున్నారు.  పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీశాడట. జై, లవ, కుశ.. ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్‌లో కనిపించే నాటకం ఎపిసోడ్‌ హైలెట్‌గా ఉంటుందంటున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు అనేకంటే జీవించాడు అంటేనే న్యాయం చేసినట్లు ఉంటుందని ఓ ఎన్నారై అభిప్రాయపడ్డాడు. సినిమా మొదటి సగం అంతా కుశ కామెడీతోనూ, లవ, రాశిఖన్నా లవ్ ట్రాక్‌తోనూ నడుస్తుందని, ఇంటర్వెల్‌లో జై వచ్చిన తర్వాత స్టోరీ అసలు లైన్‌లోకి వెళ్తుందట. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్.. అన్నీ బాగున్నాయట. ఇక తమన్నా స్పెషల్ సాంగ్.. థియేటర్‌ను షేక్ చేస్తుందంటున్నారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటన, దేవీశ్రీ మ్యూజిక్, కోన వెంకట్ మార్క్ కామెడీ, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. మొత్తంగా క్లాస్, మాస్ ఆడియన్స్ తేడా లేకుండా అందరినీ అలరించే సినిమా అని చెబుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందంటున్నారు.

Link to comment
Share on other sites

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...