Jump to content

రాజధాని అమరావతి అభివృద్ధి 2019కి స్పష్టమైన రూపం


Ramesh39

Recommended Posts

2019కి ఓ రూపం 

 ఈనాడు - అమరావతి 

5ap-main5a.jpg

రాజధాని అమరావతి అభివృద్ధి 2019నాటికి స్పష్టమైన రూపం సంతరించుకునే దిశగా ప్రభుత్వం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు భూమి కేటాయిస్తోంది. విద్య, వైద్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలు, బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు, ఆధ్యాత్మికం, మతపరం, పర్యాటకం, మ్యూజియం తదితరాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తోంది. విద్య, వైద్య సంస్థల్లో ప్రైవేటు రంగానికి చెందిన వాటికి భారీ కేటాయింపులున్నాయి. భూమి కోసం వచ్చిన ప్రతిపాదనల్ని తొలుత రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిశీలించాక మంత్రుల బృందానికి నివేదిస్తుంది. బృందం పరిశీలించి మంత్రిమండలికి సిఫార్సు చేస్తుంది. కేబినెట్‌ ఆమోదం పొందాక కేటాయింపులు ఉంటాయి. ఇప్పటికే 995.5ఎకరాల్ని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు రాజధాని నగర పరిధిలో కేటాయించారు. ఆయా సంస్థలిచ్చిన నివేదికల ప్రకారం వీటి ద్వారా సుమారు రూ.17,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 44,406 మందికి ఉపాధి కలుగుతుందని ఆయా సంస్థల అంచనా. ఇప్పటికే పరిశీలన పూర్తయి భూమిని కేటాయించాలని మంత్రుల బృందానికి సీఆర్‌డీఏ సిఫార్సు చేసిన జాబితాలో 13 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలున్నాయి. ఇవి 90ఎకరాలకు సంబంధించిన ప్రతిపాదనలు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న వాటిల్లో భారీగా 747 ఎకరాలకు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి.

ముఖ్యమైన ప్రతిపాదనల్లో కొన్ని... 

* ప్రవాసాంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగూస్‌ (ఏపీఎన్‌ఆర్‌టీ) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సొసైటీ భారీగా రూ.300 కోట్ల వ్యయంతో ఐకానిక్‌ టవర్‌ కట్టేందుకు ప్రతిపాదన ఇచ్చింది. 

* బ్రహ్మకుమారీస్‌, ఆర్ట్‌ఆఫ్‌ లివింగ్‌, అక్షర్‌ధామ్‌ వంటి సంస్థలు ఆధ్యాత్మిక కేంద్రాలు నెలకొల్పేందుకు భూమి కోరాయి. 

* రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల శాఖ 50ఎకరాల్లో సైన్స్‌ సిటీ నిర్మించేందుకు ప్రతిపాదించింది. 

* కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సంస్థ నాలెడ్జ్‌ ఎకానమీ జోన్‌ ఏర్పాటుకు 200 ఎకరాలు కోరింది. 

* పర్యావరణ వారసత్వంపై అమరావతి అంతర్జాతీయ మ్యూజియాన్ని రూ.150 కోట్లతో నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ఇచ్చింది. 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఒక్కొక్కటి చొప్పున ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు స్థలం కోరాయి.

5ap-main5b.jpg

5ap-main5c.jpg

5ap-main5d.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...