swas Posted August 11, 2016 Share Posted August 11, 2016 మంగళగిరి: కృష్ణా పుష్కరాలకు రావాలంటూ సీతానగరం వేద విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాదరంగా ఆహ్వనించారు. ఉండవల్లి కరకట్టమీది తన రెస్ట్హౌస్ నుంచి గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జీయర్ ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆశ్రమంలో వేద విద్యార్ధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆశ్రమ అధిపతి శ్రీ చినజీయర్ స్వామీజి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రికి ఎదురేగి యాగశాలలోనికి తోడ్కొని వెళ్లారు. అక్కడ పుష్కరాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక యాగంలో సీఎం పాల్గొని సీతారామలక్ష్మణుల విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం స్వామీజితో కలిసి శ్రీమన్నారాయణ తీర్ధ మండపంలోకి వెళ్లారు. అక్కడ సుమారు 35 నిమిషాల పాటు ఇరువురు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ్రమ స్థాపన, నిర్వాహణ తీరుతెన్నులను గురించి అడుగ్గా జీయర్ స్వామీజి ఆ వివరాలను వెల్లడించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.