swas Posted February 25, 2016 Share Posted February 25, 2016 దక్షిణ ఛత్తీ్సగఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో కోస్తాలో పలుచోట్ల మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యాయి. అయితే తెలంగాణ, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 40 డిగ్రీలు నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలకు అవకాశం ఉందని, తెలంగాణ, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ విభాగం తెలిపింది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.