SasiBabu Posted March 18, 2014 Share Posted March 18, 2014 కాంగ్రెస్కు ప్రజల్లో అభిమానం తగ్గలేదు : రఘువీరారెడ్డి హైదరాబాద్, మార్చి 18 : కాంగ్రెస్కు ప్రజల్లో అభిమానం తగ్గలేదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ను వీడినవారు మళ్లీ పార్టీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధ్యత గల నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో లోటు కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు లేని చోట్ల కొత్తవారికి అవకాశం కల్పిస్తామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత ముందుకు రావాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బస్సు యాత్రలో స్పందిస్తామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి 27 వరకు సీమాంధ్రలోని 13 జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు రఘువీరా తెలిపారు. సభలు, కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని ఆయన చెప్పారు. 21న శ్రీకాకుళం, విజయనగరం, 22న విశాఖ, తూ.గో, 23న ప.గో., కృష్ణా, 24న గుంటూరు, ప్రకాశం, 25న నెల్లూరు, చిత్తూరు, 26న కడప జిల్లాలో, ఈనెల 27న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి గల కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని రఘువీరారెడ్డి చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
Naga Posted March 18, 2014 Share Posted March 18, 2014 Bus tires ki air teeseyundri Link to comment Share on other sites More sharing options...
jai nandamuri Posted March 18, 2014 Share Posted March 18, 2014 politics lo evvarikaina edagali anukunte best oppurtunity congress ippudu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.