SREE_123 Posted January 17, 2014 Share Posted January 17, 2014 వంట గ్యాస్ సిలిండర్లు 9 నుంచి 12కు పెంపు : మోయిలీ న్యూఢిల్లీ, జనవరి 17 : రాయితీ వంట గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సిలిండర్లను పెంచాలని చెప్పడంతో ఆగమేఘాలమీద వీరప్ప మొయిలీ ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు సిలిండర్ల కుదింపుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినా పట్టించుకోని కేంద్రం ఈరోజు రాహూల్ ఒక్క మాట చెప్పేసరికి మొయిలీ ఈ ప్రకటన చేశారు. కాగా రాయితీ సిలిండర్లను పెంచుతూ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. ప్రజలకు అవసరమైనప్పుడు కాకుండా ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల కోసమే సిలిండర్ల పెంపు నిర్ణయం తీసుకున్నారని షానవాజ్ ఆరోపించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.