Jump to content

Androllu saamaanyulu kaadu sumee


Cyclist

Recommended Posts

 

ఆంధ్రా, తెలంగాణ వేరుకాదని, రెండు ప్రాంతాలు తమకు ఒక్కటేనని, తెలంగాణ కేసీఆర్ అబ్బ సొత్తు కాదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ది విజయనగరం జిల్లా, బుడ్డిపేటని, కే. కేశవరావుది విజయవాడని, విజయశాంతిది రాజమండ్రి నుంచి వచ్చిన వారేనని పేర్కొన్నారు. సీమాం«ద్రుడి చేతిలో తెలంగాణ ఉద్యమం ఉండడం దురదృష్టకరమని మోత్కుపల్లి అన్నారు.

తెలుగుదేశం పార్టీ వల్లే బతికి, పైకి వచ్చిన నీవు, మమల్ని పార్టీ వదిలి రమ్మంటావా? అంటూ మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అమ్ముడు పోయే సరకని, ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసమే తెలంగాణ రావొద్దని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని టీడీపీ కోరుకుంటోందని, సీమాంధ్రకు రాజధాని ఎక్కడో కూడా కేంద్రం ఇంతవరకు చెప్పాలేదని మోత్కుపల్లి విమర్శించారు. కాంగ్రెస్ తీరును ఖండించకుండా టీడీపీని కేసీఆర్ విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు సీఎం కిరణ్ చేత అడ్డంకులు సృష్టిస్తున్న సోనియాను కేసీఆర్ ఎందుకు విమర్శించడంలేదని మోత్కుపల్లి ప్రశ్నించారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మానం చేస్తానని కెసిఆర్ అంటున్నాడని, ఆయన చేసేది పునర్నిర్మాణమా? లేక పెత్తందార్ల పునర్నిర్మాణమా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. నిత్యం ఫాంహౌస్‌లో ఉండే కెసిఆర్‌కు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి, నైతిక అర్హత లేవన్నారు. కెసిఆర్ ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన విషయం మరిచిపోవద్దని హితవు పలికారు

 

 

vammo coastal vaallu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...