SREE_123 Posted July 11, 2012 Share Posted July 11, 2012 కేసుల తేలేదాకా.. జేడీ ఇక్కడే: సీబీఐ న్యూఢిల్లీ, జూలై 10: రాష్ట్రంలో సీబీఐ విచారిస్తున్న ముఖ్యమైన కేసుల దర్యాప్తు, కోర్టు విచారణ పూర్తయ్యేంతవరకూ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అదే పదవిలో కొనసాగనున్నారు. లక్ష్మీనారాయణ పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలున్నాయని సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ 'ఆన్లైన్'కు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతున్న కేసులకు అత్యంత ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా ఆయనను రాష్ట్రం నుంచి కదిలించే ప్రసక్తి లేదని సింగ్ స్పష్టం చేశారు. కాగా, ఇటీవల లక్ష్మీనారాయణను అప్రతిష్ఠ పాలు చేసేందుకు జరిగిన కుట్రను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణ కాల్ లిస్టు సేకరించి న వ్యవహారంలో ఇద్దరు ఎంపీలు, ఒక పారిశ్రామిక వేత్త కూడా ఉ న్నారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో వారి పాత్రనూ బయటపెట్టాలని సీబీఐ యోచిస్తున్నట్లు తెలిసింది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.