Jump to content

జలయజ్ఞం జలగ


Cyclist

Recommended Posts

హైదరాబాద్‌: నీటి పారుదల శాఖ అధికారి సీతాపతి రావుపై తెలుగుదేశం పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డికి అందజేశారు. తెలుగుదేశం పార్టీ శాసనభా సమయాన్ని వృధా చేసిందని సీతాపతిరావు వ్యాఖ్యానించడంపై ఈ నోటీసును ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులలో వేలాది కోట్ల రూపాయల కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు టి. దేవేందర్‌ గౌడ్‌, చెన్నమనేని రాజేశ్వరరావు, సానా మారుతి మంగళవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. అవినీతి ముఖ్యమంత్రి ప్రజావసరాలను అడ్డం పెట్టుకుని తన అవసరాలను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారన్నారు. కొంత మంది అధికారులను ఏజెంట్లుగా పెట్టుకుని నీటి పారుదల శాఖను పూర్తిగా కాంట్రాక్టర్లకు అప్పగించారని వారన్నారు. కావాలనుకుంటే సీతాపతికి రాజశేఖర్‌ రెడ్డి మంత్రి పదవి ఇచ్చుకోవచ్చునని వారు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా సమయాన్ని వృధా చేసిందని హైదరాబాద్‌లోని జూబిలీహాల్‌లో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సీతాపతిరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తోటపల్లి ప్రాజెక్టుపై ఆదివారంనాడు బహిరంగ చర్చను నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సానా మారుతికి, నీటి పారుదల శాఖ అధికారులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...