Jump to content

సచిన్ సరికొత్త రికార్డు:


Recommended Posts

అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న టీమ్ ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ ఏడాది కేవలం 8 మ్యాచ్‌ల్లోనే వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. వయసు మీద పడుతున్నప్పటికీ మాస్టర్ బ్లాస్టర్ పరుగుల మోత మోగిస్తున్నాడు.

 

అటు వన్డే, ఇటు టెస్టు ఫార్మాట్‌ల్లోనూ తనదైన శైలిలో ధీటుగా రాణిస్తున్న సచిన్, తాజాగా ఆస్ట్రేలియాతో మొహాలీతో జరుగుతున్న తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో 98వద్ద ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. దీంతో సచిన్ టెండూల్కర్ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు.

 

కాగా, కంగారూలతో మొహాలీలో జరుగుతున్న తొలి టెస్టులో విజయం అందుకుంటుందని భావించిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బ్యాట్స్‌మెన్లు వెంట వెంటనే పెవిలియన్ దారి పట్టడంతో భారత్‌ నానా కష్టాలు పడుతోంది.

 

తొలి టెస్టు ఐదో రోజైన మంగళవారం 55/4 స్కోరుతో బరిలోకి దిగిన భారత్, ఆసీస్ బౌలర్ల ధాటికి వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనవసరంగా రన్నవుట్ అయ్యాడు. హర్భజన్ సింగ్ కూడా వెంటనే అవుటయ్యాడు. ఫలితంగా 124 పరుగులకు భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం వీవీయస్ లక్ష్మణ్ ఒక్కడే ఎదురీదుతున్నాడు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...