-
Posts
75,388 -
Joined
-
Last visited
-
Days Won
113
Everything posted by sonykongara
-
Akhanda Godavari tourism project
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
Akhanda Godavari Project: తూర్పు పర్యాటక సిరి.. ‘అఖండ గోదావరి’ By Andhra Pradesh News DeskUpdated : 26 Jun 2025 08:10 IST Ee Font size 3 min read పుష్కరాల రేవుకు ఆధ్యాత్మిక శోభ వినోదాలకు వేదికగా హేవలాక్ వంతెన చుట్టు పక్కల ప్రాంతాలనూ తీర్చిదిద్దే ‘అఖండ గోదావరి ప్రాజెక్ట్’కు నేడు శంకుస్థాపన నిడదవోలులోని కోటసత్తెమ్మ తల్లి ఆలయం ఈనాడు, రాజమహేంద్రవరం: చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) కింద రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు, 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంక (హేవలాక్ వంతెన, రోడ్కం రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతం)ను వినోద కేంద్రంగా మార్చనున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు ప్రాజెక్టు పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. బ్రిడ్జిలంకలో వినోదం.. హేవలాక్ వంతెన నుంచి బ్రిడ్జిలంకలోకి దిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. తపోవనం పేరిట బోటింగ్, జల, సాహస క్రీడలు, రెస్టారెంట్లు, ధ్యాన మందిరం, ఆయుర్వేద కేంద్రాలు, ఈవెంట్ స్పేస్తో పాటు పీపీపీ విధానంలో మరిన్ని వినోదాత్మక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు గోదావరిలో బోటు షికారు చేస్తూ కడియం నర్సరీల్లో అందాలను వీక్షించవచ్చు. కడియపులంకలో ఉన్న 2.60 ఎకరాల్లో నర్సరీల ఎక్స్పీరియన్స్ సెంటర్, వేమగిరి నుంచి కడియపులంక వరకు బోటింగ్, గట్టు పటిష్ఠత, స్టాల్స్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశారు. నిడదవోలులో శ్రీకోటసత్తెమ్మ తల్లి ఆలయానికి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా వసతులు, ఆలయ అభివృద్ధి చేయనున్నారు. సమిశ్రగూడెంలో 23 కి.మీ. మేర గోదావరి కాలువలో బోటింగ్తో పాటు ఫుడ్కోర్టులు, విశ్రాంతి గదులు ఏర్పాటుచేస్తారు. నిడదవోలులో గోదావరి కాలువ పక్కన ఏర్పాటు చేయనున్న వసతులు వేల మందికి ఉపాధి అఖండ గోదావరి ప్రాజెక్టును పట్టాలెక్కించడం ద్వారా ఏడాదికి సగటున 18 లక్షల నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర ఘాట్.. గోదావరి పుష్కరాలంటే గుర్తొచ్చే రాజమహేంద్రవరం పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఘాట్లో ఉన్న ఆలయాల విశిష్టత తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు గోదావరి హారతి ఇచ్చేలా తీర్చిదిద్దుతారు. ఆధ్యాత్మిక, యోగా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని దశాబ్దాలుగా ఉన్న ఆకాంక్ష కూటమి హయాంలో సాకారం కానుంది. వంతెనను 12 మీటర్ల వరకు వెడల్పు చేసి నగర, రాష్ట్ర చరిత్ర, విశిష్టతలు, కళా రంగాలు ఇలా.. వివిధ థీమ్లతో అభివృద్ధి చేస్తారు. దీంతోపాటు వంతెనపైనే 10 స్టాల్స్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు, సెల్ఫీ, వ్యూ పాయింట్లు ఉంటాయి. కడియంలో నిర్మించే ఎక్స్పీరియన్స్ సెంటర్ రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు పుష్కరాల రేవు రూపురేఖలు మారనున్నాయిలా... -
Akhanda Godavari tourism project
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
quantum computer ni minus 270 degrees celsius daggra unchali anta deni kavalasina ecosystem veru ga untundi. -
అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు By Andhra Pradesh News TeamPublished : 26 Jun 2025 15:26 IST Ee Font size 1 min read అమరావతి: అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో ఎల్ 1గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఎపీ సెక్రటేరియట్, హెచ్ఓడీ కార్యాలయాల (GAD టవర్) నిర్మాణ టెండర్లను ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రూ.882.47 కోట్లతో సచివాలయంలోని జీఏడీ టవర్ను నిర్మించనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 1, 2 హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజి సంస్థ దక్కించుకుంది. రూ.1487.11 కోట్ల వ్యయంతో ఈ టవర్ల నిర్మాణ పనులు చేపట్టనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3, 4 హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ దక్కించుకుంది. రూ.1303.85 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనుంది. ఎల్ 1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ సురేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
ఈ నెల 30 న క్వాంటం డిక్లరేషన్! By Andhra Pradesh News DeskPublished : 26 Jun 2025 05:26 IST Ee Font size 4 min read రాష్ట్రానికి ‘గేమ్ ఛేంజర్’ అవుతుందన్న నిపుణులు అమరావతిలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ విజయవాడలో క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్షాప్ హాజరైన ఐబీఎం, ఎల్టీఐ మైండ్ట్రీ ప్రతినిధులు విజయవాడ-అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీపై నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడుతున్న కాటమనేని భాస్కర్. చిత్రంలో నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు ఈనాడు, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే సదస్సుల్లో ప్రభుత్వం ‘అమరావతి క్వాంటం డిక్లరేషన్’ను ప్రకటించనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం వ్యాలీ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతికతపై మీడియాకు అవగాహన కల్పించేందుకు విజయవాడలో బుధవారం ‘క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్షాప్’లో ఐబీఎం, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఐటీ రంగ నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. సాంకేతికరంగంలో నిపుణులు, పరిశ్రమలు, ప్రభుత్వ ప్రతినిధులు అందించే సూచనల ఆధారంగా డిక్లరేషన్ తయారుచేస్తామని.. ఎండ్ యూజర్స్కు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తామని వారు పేర్కొన్నారు. ‘క్వాంటం హార్డ్వేర్, సెన్సింగ్, ఇన్నోవేషన్పై రౌండ్టేబుల్ చర్చలు ఉంటాయి. క్వాంటం స్టార్టప్ ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఐబీఎం, టీసీఎస్, అమెరికా కాన్సుల్ జనరల్, నీతి ఆయోగ్ సంస్థల ప్రతినిధుల నుంచి అందిన సూచనలను క్రోడీకరించి క్వాంటం డిక్లరేషన్ తయారు చేస్తాం. క్వాంటం వ్యాలీ అనేది రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ టెక్నాలజీ కాబోతోంది’ అని అభిప్రాయపడ్డారు. క్లాసికల్ కంప్యూటర్ కంటే వేల రెట్ల వేగం ‘ప్రస్తుతం మనం వినియోగిస్తున్న క్లాసికల్ కంప్యూటర్ల కంటే వేల రెట్ల వేగంతో క్వాంటం కంప్యూటర్ పనిచేస్తుంది. గత 30-40 ఏళ్లుగా క్వాంటం కంప్యూటింగ్పై పరిశోధనలు జరుగుతున్నాయి. 2030 నాటికి ఇది విస్తృతంగా వినియోగంలోకి వస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ చాలా వేగంతో.. కచ్చితత్వంతో పనిచేస్తుంది. నిమిషాలు.. గంటల్లో పరిశోధన, ఉత్పత్తులను రూపొందించే అవకాశం ఉంటుంది. క్వాంటం విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు రాష్ట్రానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. రాష్ట్రంలోని యువతకు సాంకేతికంగా ఎంతో గుర్తింపు ఉంది. ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు దీనిపై పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ ఊహించనంత వేగంగా జనజీవితంలో భాగం కానుంది. ఈ దృష్ట్యా ప్రస్తుతం చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటం క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయి.’ పి.ఎస్.ప్రద్యుమ్న, సీఎం కార్యదర్శి అమరావతిలో.. 156 క్యూబిట్స్ క్వాంటం సిస్టం-2 ‘దేశంలోనే అత్యంత వేగవంతమైన ‘156 క్యూబిట్స్ క్వాంటం సిస్టం-2’ క్వాంటం కంప్యూటర్ను ఐబీఎం సంస్థ అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటుచేస్తుంది. జపాన్, కెనడా, అమెరికా, చైనా లాంటి దేశాల్లోనే ప్రస్తుతం క్వాంటం కంప్యూటర్లు ఉన్నాయి. ఐటీ రంగానికే కాకుండా ఫార్మా, వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక పాత్రను క్వాంటం కంప్యూటింగ్ పోషిస్తుంది. విద్యార్థులు, పరిశోధకులు, పరిశ్రమలు దీన్ని వినియోగించుకోవచ్చు. ఐటీ రంగం మాదిరే పెద్దఎత్తున హైఎండ్ ఉపాధి అవకాశాలు వస్తాయి. అమరావతిలో ఏర్పాటుచేసే రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ అంకుర సంస్థలకు మంచి అవకాశాలు కల్పిస్తాయి. అమరావతిలో 50 ఎకరాల్లో ఏర్పాటుచేసే క్వాంటం వ్యాలీ.. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఏఐ, సెమికండక్టర్లు, రక్షణ, సాంకేతికతల కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ఐబీఎం బ్యాక్ ఎండ్లో సేవలు అందిస్తే.. ఫ్రంట్ ఎండ్లో టీసీఎస్ క్లాసికల్ కంప్యూటర్ సేవలను అందిస్తుంది. క్వాంటం కంప్యూటర్ ఉన్న భవనంలో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించాలి. ఆ భవనాల నిర్మాణానికి ఎల్ అండ్ టి సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నాం.’ కాటమనేని భాస్కర్, ఐటీ శాఖ కార్యదర్శి అమరావతి క్వాంటం వ్యాలీతో కలిసి పనిచేస్తాం ‘ఐబీఎం ఇప్పటికే 1,000 క్యూబిట్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి. విద్యార్థులు, పరిశ్రమలు అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం వ్యాలీ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్ వంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికత ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో టెక్నాలజీ విస్తృతసేవలు అందిస్తోంది. ప్రపంచానికి ఉపయోగపడే క్వాంటం కంప్యూటింగ్ అందించాలన్నదే జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యం. అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం వ్యాలీతో కలిసి పనిచేయడం ద్వారా మంచి అప్లికేషన్లు.. ఆల్గరిథంలను అభివృద్ధి చేయాలన్నదే ఆలోచన.’ ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ (ఐఐటీ మద్రాస్), నేషనల్ క్వాంటం మిషన్ సభ్యుడు, టీసీఎస్ సలహాదారు స్టార్లింగ్ కంప్యూటింగ్ తెస్తాం ‘ఐబీఎం సంస్థ 2029 నాటికి స్టార్లింగ్ అనే భారీ స్థాయి క్వాంటం కంప్యూటింగ్ సిస్టంను రూపొందిస్తోంది. సమీప భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ వినియోగం.. పెట్టుబడులు విస్తృతంగా పెరగనున్నాయి. లాజిస్టిక్స్, స్పేస్, ఔషధరంగం, విద్య, వైద్యం, ఫైనాన్షియల్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ కీలకంగా మారుతుంది. అమరావతిలో లాజికల్ క్యూబిట్స్ కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు దేశంలో ఓ కీలక పరిణామంగా మారుతుంది.’ డాక్టర్ అమిత్ సింఘే, ఐబీఎం సంస్థ డైరెక్టర్ దేశంలోనే మొదటి క్వాంటం వ్యాలీ ‘దేశంలోనే తొలి పూర్తిస్థాయి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతుంది. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. రిస్క్ ఎనాలిసిస్, వాతావరణమార్పు, క్రిప్టోగ్రఫీ ఆప్టిమైజేషన్ లాంటి అంశాలకు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తరిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా జరిగే లావాదేవీల పర్యవేక్షణ, వరుససంఖ్యల జారీ లాంటి అంశాలలో సాంకేతికత ఉపయోగపడుతుంది. లాజిస్టిక్స్, సప్లై చైన్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్కేర్, రోబోటిక్స్ అంశాల్లో క్వాంటం, ఏఐ టెక్నాలజీల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.’ విజయరావు, ఎల్టీఐ మైండ్ ట్రీ ప్రతినిధి -
సమీకరించే భూములన్నింటికీ.. ఒకే రకం ప్యాకేజీ రాజధాని అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతుల కల్పన తదితర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. మరింత భూమిని సమీకరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. By Andhra Pradesh News DeskPublished : 25 Jun 2025 04:51 IST Ee Font size 2 min read రూ.1.50 లక్షల పంటరుణం మాఫీ వివాదాలకు తావులేకుండా భూయాజమాన్య హక్కుల నిర్ధారణ భూమిలేని పేదలకు పదేళ్లపాటు నెలకు రూ.5వేల పింఛన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు మంత్రివర్గం ఆమోదముద్ర మంత్రి పార్థసారథి ఈనాడు-అమరావతి: రాజధాని అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతుల కల్పన తదితర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. మరింత భూమిని సమీకరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సీఆర్డీఏ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2025’కు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజధాని భూసమీకరణ సహా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా, రాష్ట్రానికి ఆర్థికశక్తిగా రూపుదిద్దేందుకు.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరింత భూమి అవసరమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని భూసమీకరణ నిబంధనలు 2025 రూపొందించినట్లు తెలిపారు. 2015నాటి భూసమీకరణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. రైతులకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేశామని వివరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసే వారైతే.. 2019 ఏప్రిల్ 1 నాటికి వారి ఆధీనంలో భూమి ఉండాలని పేర్కొన్నారు. ఆమోదించిన ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. రాజధానికి భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయం. గుర్తించిన అన్ని భూములకు ఏకరీతి విధానం అమలు. గతంలో రికార్డుల పరంగా ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు. ఆధార్, పాస్పోర్టు ఇతర పత్రాల ఆధారంగా యజమానుల గుర్తింపు. పర్యావరణ మండలి, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నీటివనరుల రక్షణ. ఎసైన్డ్, దేవాదాయ, లంక భూములపై స్థానిక సంయుక్త కలెక్టర్ ద్వారా విచారణ. వివాదాలకు తావు లేకుండా.. కచ్చితమైన యాజమాన్య హక్కుల నిర్ధారణ. సర్వే సమయంలో సరిహద్దుల విషయంలో వివాదాలు తలెత్తకుండా సాంకేతికత, డ్రోన్ల వినియోగం. రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల పరంగా రైతులకు ఎలాంటి సమస్యలూ లేకుండా సరిదిద్దడం. భూమిలేని పేదలకు పదేళ్లపాటు నెలకు .5 వేల పింఛను. రైతులకు ఒకే దఫాలో రూ.1.50 లక్షల పంటరుణం మాఫీ. ఆ ప్రాంతంలోని రైతు కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం. వృద్ధులు, అవసరమైన వారి కోసం ఆశ్రమాల ఏర్పాటు.
-
రాజధానిలో అదనపు భూసమీకరణకు జులైలో నోటిఫికేషన్ రాజధాని అమరావతి అవసరాలకు అదనపు భూ సమీకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. By Andhra Pradesh News DeskPublished : 25 Jun 2025 06:26 IST Ee Font size 2 min read పాత నిబంధనలే వర్తించేలా నిర్ణయం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి అవసరాలకు అదనపు భూ సమీకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. భూ సమీకరణపై 2015లో జారీ చేసిన నిబంధనలే అమలుచేసేలా మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో నారాయణ విలేకర్లతో మాట్లాడారు. ‘రాజధాని అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 10 వేల ఎకరాలు అవసరం. ఇందుకోసం రైతుల నుంచి 45వేల ఎకరాలు సమీకరించాలి. అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉన్నందున ఎక్కువ భూమి అవసరమవుతుంది. ఇందుకు సంబంధించి రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. గ్రామ కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించాం. రాజధానిలోని 29 గ్రామాలను ఆనుకుని అటు జాతీయ రహదారి, ఇటు కృష్ణా నది ఇవతల, ఔటర్ రింగ్రోడ్డు మధ్యలో అదనంగా భూ సమీకరణ చేయనున్నాం. 2014-19లో సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు 98% ప్లాట్లు కేటాయించాం. మిగిలిన 2% అన్నదమ్ముల మధ్య గొడవలు, కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో ఉన్నాయి’ అని వివరించారు. రూ.52 వేల కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి ‘రాజధానిలో 2018లో ఏడాది వ్యవధిలో 360 కి.మీ. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ల రోడ్లు, ఐకానిక్ భవనాల పనులకు రూ.9వేల కోట్లు ఖర్చుచేశాం. మరో ఏడాదిన్నరలో ప్రాజెక్టు పూర్తయ్యేది. వైకాపా ప్రభుత్వం ఆడిన మూడు ముక్కలాటతో మొత్తం నాశనమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.52వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచాం. అన్ని పనులూ ప్రారంభమయ్యాయి. ఏడాదిలో అధికారులకు సంబంధించిన భవన నిర్మాణాలు పూర్తవుతాయి. ట్రంక్ రోడ్లు ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో, లేఅవుట్ రోడ్లు రెండున్నరేళ్లు, ఐకానిక్ భవనాలు మూడేళ్లలో పూర్తి చేస్తాం. నాలుగు వరుసల కరకట్ట రహదారి అభివృద్ధిపై త్వరలో నిర్ణయం నాలుగు వరుసల కరకట్ట రహదారి విషయంలో రెండు వైపులా కాంక్రీట్ గోడ కట్టాలా? ఒకవైపు కాంక్రీట్, రెండోవైపు మట్టితో కట్టాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. కరకట్ట లోపలికి వెళ్లొచ్చా లేదా అనే దానిపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలు కూడా పరిశీలిస్తున్నాం’ అని మంత్రి నారాయణ తెలిపారు.
-
@AndhraBullodu
-
ijayawada: హైదరాబాద్ - విజయవాడ హైవే గొల్లపూడి వరకు విస్తరించండి అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ హైవే-65ను గొల్లపూడి వరకు విస్తరించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విస్తరణను కంచికచర్ల వరకే పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. By Andhra Pradesh News DeskUpdated : 25 Jun 2025 07:38 IST Ee Font size 3 min read కంచికచర్ల వద్ద ఓఆర్ఆర్ వరకే విస్తరిస్తే ప్రయోజనం ఉండదు విజయవాడ-మచిలీపట్నం హైవే కానూరు నుంచి విస్తరించాలి కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు ఈనాడు, అమరావతి: అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ హైవే-65ను గొల్లపూడి వరకు విస్తరించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విస్తరణను కంచికచర్ల వరకే పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. సలహా సంస్థ రూపొందించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో అమరావతి ఓఆర్ఆర్ వరకు విస్తరణ చాలని ప్రతిపాదించడంతో.. ఈ మేరకే ఎన్హెచ్ఏఐ పరిశీలిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. గతంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ వరకు హైవేను ఆరు వరుసలుగా విస్తరించాల్సిందేనని కోరుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి తాజాగా లేఖ రాశారు. ఈ హైవే హైదరాబాద్-విజయవాడ కనెక్టివిటీకి సంబంధించినదని, గొల్లపూడి వరకు విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. తొలి ప్రతిపాదనను పక్కనపెట్టి.. హైదరాబాద్ నుంచి మల్కాపూర్ వరకు 40 కి.మీ. ఆరు వరుసలుగా ఉంది. మల్కాపూర్ నుంచి విజయవాడ శివారు గొల్లపూడి వద్ద పశ్చిమ బైపాస్ వరకు 226 కి.మీ. ఇప్పుడున్న నాలుగు వరుసల స్థానంలో ఆరు వరుసలుగా విస్తరించేలా గతంలోనే ప్రతిపాదన ఉంది. గత ఏడాది వరకు ఈ హైవే గుత్తేదారుగా ఉన్న జీఎంఆర్ సంస్థతో ఎన్హెచ్ఏఐకి వివాదాలు నెలకొనడం, కోర్టు కేసుల కారణంగా విస్తరించలేదు. గత ఏడాది జీఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో విస్తరణకు సిద్ధమయ్యారు. 226 కి.మీ. ఆరు వరుసలుగా విస్తరించేందుకు రూ.8,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. గొల్లపూడి వరకు కాకుండా అమరావతి ఔటర్ రింగ్ క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే విస్తరించే ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. దీనివల్ల మొత్తం 226 కి.మీ. బదులు 198 కి.మీ. మాత్రమే విస్తరిస్తారు. కంచికచర్ల నుంచి గొల్లపూడి వరకు 28 కి.మీ. ఇప్పుడున్నట్లు నాలుగు వరుసలుగానే ఉంటుంది. దీనిపై ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. ఎన్టీఆర్ కలెక్టర్ వద్ద జరిగిన సమావేశంలో ఎన్హెచ్ఏఐ అధికారులను నేతలు ప్రశ్నించారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో.. ఆయన తాజాగా గడ్కరీకి లేఖరాసి.. గొల్లపూడి వరకు ఆరు వరుసలు చేయాల్సిందేనని కోరారు. బందరు హైవే విస్తరణలోనూ ఇంతే.. విజయవాడ-మచిలీపట్నం (బందరు) హైవేని నాలుగు నుంచి ఆరు వరుసలుగా విస్తరించే విషయంలోనూ ఎన్హెచ్ఏఐ వింత వాదన తెరపైకి తెచ్చింది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు 65 కి.మీ. ఉండగా, ఇందులో కానూరు నుంచి మచిలీపట్నం వరకు 61 కి.మీ. విస్తరించేలా తొలుత ప్రతిపాదన ఉంది. బెంజ్ సర్కిల్ నుంచి కానూరు వరకు ఎక్కువ భవనాలు ఉండటం, అక్కడ ఈ ఎన్హెచ్కు సేకరించిన భూమి వెడల్పు (ఆర్ఓడబ్ల్యూ) 30 మీటర్లే ఉండటంతో.. ఈ నాలుగు కి.మీ. ఆరు వరుసలు చేయడం సాధ్యంకాదని తేల్చారు. కానూరు నుంచి ఆర్ఓడబ్ల్యూ 60 మీటర్ల మేరకు ఉంది. దీంతో కానూరు నుంచి మచిలీపట్నం వరకు 61 కి.మీ. ఆరు వరుసలుగా విస్తరిస్తారని భావించారు. ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు మాత్రం.. ఈ హైవేపై కంకిపాడు దాటిన తర్వాత నెప్పల్లి సమీపంలో అమరావతి ఓఆర్ఆర్ క్రాస్ అవుతుండగా, అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 46 కి.మీ. మాత్రమే ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. అంటే కానూరు నుంచి నెప్పల్లి వరకు నాలుగు వరుసలుగానే ఉంటుంది. కానూరు నుంచి విస్తరించాలని కోరిన సీఎం విజయవాడ-మచిలీపట్నం హైవే విషయంలో కూడా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి గడ్కరీకి మరో లేఖ రాశారు. నెప్పల్లి సమీపంలోని ఔటర్ రింగ్ వద్ద నుంచి కాకుండా, విజయవాడ నగర పరిధిలో కానూరు నుంచి ఆరు వరుసలుగా విస్తరించాలని లేఖలో కోరారు. విజయవాడ నగర ట్రాఫిక్ పెరుగుతుండటం, నగరం కూడా వేగంగా విస్తరణ జరుగుతుండటంతో.. కానూరు నుంచే హైవే విస్తరణ చేపట్టేలా చూడాలని, ఈ మేరకే డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు.
-
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Quantum Computing Valley In Amaravati
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
USA lo unde valla ki isthaunnaru