విశాఖ విప్రో క్యాంపస్ విస్తరణ!
మంత్రి లోకేశ్తో సంస్థ ప్రతినిధుల భేటీ
లోకేశ్ను కలిసిన గోవా ఐటీ మంత్రి
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని విప్రో క్యాంప్సను విస్తరిస్తామని, త్వరలోనే రెండో దశ పనులు ప్రారంభిస్తామని విప్రో ప్రతినిధులు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఐటీ మంత్రి లోకేశ్తో వారు భేటీ అయ్యారు. విశాఖ క్యాంప్సలో ప్రస్తుతం 1500 మందికి ఉపాధి కల్పించామని, త్వరలో రెండో దశ పనులు ప్రారంభించి మరో 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా ఉంచే బ్లాక్ చైన్ టెక్నాలజీని అన్ని శాఖల్లోనూ వినియోగించుకొనేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కోర్ డ్యాష్ బోర్డుతోనే ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేసే విధంగా సహకరిస్తామని తెలిపారు. ఐటీ సంస్థలకు తగినన్ని సదుపాయాలు కల్పిస్తామని అయితే, స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు కల్పించాలని లోకేశ్ విప్రో ప్రతినిధులను కోరారు.
లోకేశ్తో కార్బన్ మొబైల్స్ చైర్మన్ భేటీ
కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసీజా కూడా లోకేశ్తో భేటీ అయ్యారు. తిరుపతిలోని ఎలకా్ట్రనిక్స్ హబ్లో తమ ఫ్యాక్టరీ నిర్మాణం అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో జరుగుతోందని సుధీర్ వివరించారు. విడిభాగాల దిగుమతుల కోసం చెన్నైలో కస్టమ్స్ అనుమతులు తీసుకోవాల్సి వస్తోందని, తిరుపతిలోనే కస్టమ్స్ అనుమతులు ఇస్తే మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. కాగా, గోవా ఐటీ మంత్రి రోహన్ కూడా లోకేశ్ను కలిశారు ఐటీ రంగంలో సహకరించాలని కోరారు. ఏపీ ఎలకా్ట్రనిక్స్ అండ్ ఏజెన్సీ అధికారులతోనూ లోకేశ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ- ప్రగతి ప్రాజెక్టు అభివృద్ధిపైనా సమీక్షించారు.